News August 13, 2024

16 నుంచి రెవెన్యూ సదస్సులు ప్రారంభం

image

భూ సంబంధిత సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించే లక్ష్యంతో ఈ నెల 16 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మంత్రి స్వామి అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యూ సమస్యలపై కలెక్టర్ తమీమ్ అన్సారీయ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ.. జిల్లాలో రెవెన్యూ సదస్సు 45 రోజులు పాటు జరుగుతుందని చెప్పారు. రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించినట్లు తెలిపారు.

Similar News

News November 18, 2025

16 లక్షలకు పైగా ఉద్యోగాలు: నూకసాని

image

విశాఖలో జరిగిన సీఐఐ గ్లోబల్ సమ్మిట్ ఏపీ అభివృద్ధి దిశను పూర్తిగా మార్చే చారిత్రాత్మక వేదికగా నిలుస్తుందని ఏపీ టూరిజం డెవలప్మెంట్ సంస్థ ఛైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. ఒంగోలులోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. ‘విశాఖ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. 613 ఒప్పందాల ద్వారా 16 లక్షలపైగా ఉద్యోగాలు యువతకు లభిస్తాయి’ అని చెప్పారు.

News November 18, 2025

16 లక్షలకు పైగా ఉద్యోగాలు: నూకసాని

image

విశాఖలో జరిగిన సీఐఐ గ్లోబల్ సమ్మిట్ ఏపీ అభివృద్ధి దిశను పూర్తిగా మార్చే చారిత్రాత్మక వేదికగా నిలుస్తుందని ఏపీ టూరిజం డెవలప్మెంట్ సంస్థ ఛైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. ఒంగోలులోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. ‘విశాఖ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. 613 ఒప్పందాల ద్వారా 16 లక్షలపైగా ఉద్యోగాలు యువతకు లభిస్తాయి’ అని చెప్పారు.

News November 18, 2025

ప్రకాశం: మనవడిపై ఫిర్యాదు చేసిన అవ్వ.!

image

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం నాగంపల్లికి చెందిన 80ఏళ్ల వృద్ధురాలు సోమవారం SP హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేసింది. మనవడు తనను పలుమార్లు కొట్టాడని వృద్ధురాలు ఆరోపించింది. కోడలు తీసుకున్న డబ్బులు ఇవ్వడంలేదని కూడా ఫిర్యాదు చేసింది. SP హర్షవర్ధన్ రాజు వృద్ధురాలితో ఆప్యాయంగా మాట్లాడి విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం ఆయన విచారణకు ఆదేశించారు.