News December 22, 2025
16 సోమవారాల వ్రత ఉద్యాపన నియమాలు

వ్రతం పూర్తయ్యాక 17వ సోమవారం నాడు ఉద్యాపన చేయాలి. ఉదయాన్నే శివపార్వతులను పూజించాలి. గోధుమ పిండి, బెల్లం, నెయ్యితో ‘చూర్మ’ ప్రసాదాన్ని చేయాలి. దాన్ని 3 భాగాలు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టాలి. మిగిలిన రెండు భాగాల్లో ఒకటి దానం చేసి, మిగితాది మీరు స్వీకరించాలి. 16 మందికి శక్తి మేర భోజనం, తాంబూలం ఇవ్వడం మంచిది. శాస్త్రోక్తంగా చేసే ఉద్యాపనతో వ్రత ఫలం సంపూర్ణంగా దక్కి, కోరిన కోర్కెలు నెరవేరుతాయి.
Similar News
News December 26, 2025
యశ్ దయాల్ స్థానంలో ఉమేశ్ యాదవ్?

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న RCB బౌలర్ యశ్ దయాల్ స్థానంలో IND సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ను వచ్చే సీజన్లో జట్టులోకి తీసుకోనున్నట్లు క్రీడావర్గాల్లో చర్చ జరుగుతోంది. పోక్సో కేసు నమోదైన యశ్ను జట్టులో ఎలా కొనసాగిస్తారని RCBపై విమర్శలొస్తున్నాయి. తాజాగా అతని ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది. దీంతో ఉమేశ్ను తీసుకోనున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై RCB నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
News December 26, 2025
సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు: బీసీ జనార్దన్

AP: రాష్ట్రంలోని రోడ్లను సంక్రాంతి నాటికి గుంతల రహితంగా తీర్చిదిద్దాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పలు జిల్లాల ఆర్&బి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో రోడ్ల పరిస్థితి, జరుగుతున్న పనులపై ఆరా తీశారు. గతేడాది సంక్రాంతికి పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన ప్రజలు, స్థానికులు రహదారులు మెరుగుపడటంపై సంతోషం వ్యక్తం చేశారని ఆయన తెలిపారు.
News December 26, 2025
అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయండి: కేంద్ర మంత్రికి CBN వినతి

AP: వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను CM CBN కోరారు. పంచసూత్రాల ప్రణాళిక అమలుతో వ్యవసాయ అనుబంధ రంగాల్లో 10.70% అభివృద్ధి సాధించామన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, రూ.2,585 కోట్ల అంచనాతో డీపీఆర్ను వ్యవసాయ పరిశోధన, విద్య విభాగానికి ఇప్పటికే సమర్పించినట్టు వినతిపత్రంలో పేర్కొన్నారు.


