News March 26, 2024
మూడేళ్లలో 16 ఈవీలు లాంచ్: నిస్సాన్

గ్లోబల్గా మూడేళ్లలో 30 మోడళ్లను (16 ఈవీ, 14 ఇంటర్నేషనల్ కంబషన్ ఇంజిన్) లాంచ్ చేయనున్నట్లు నిస్సాన్ ప్రకటించింది. వచ్చే ఏడాదిలోపు భారత్లో మూడు మోడల్స్ లాంచ్ చేస్తామని వెల్లడించింది. ఎగుమతుల్లో లక్ష యూనిట్ల మార్క్ అందుకుని భారత్ను ఎక్స్పోర్ట్ హబ్గా నిలుపుతామని పేర్కొంది. ఇక ఈ ఏడాది మొదలుకుని 2030 నాటికి 34 ఈవీలను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది.
Similar News
News April 11, 2026
రేపు ఉ.11 గంటలకు ఇంటర్ ఫలితాలు

తెలంగాణ ఇంటర్ ఫలితాలను రేపు ఉ.11 గంటలకు విడుదల చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. హైదరాబాద్లోని TGBIE భవనంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఉన్నతాధికారులు పాల్గొంటారని తెలిపింది.
* రేపు ఒక్క క్లిక్తో అందరి కంటే వేగంగా Way2Newsలో రిజల్ట్స్ను తెలుసుకోండి.
News April 11, 2026
మా ‘స్వీటెస్ట్’ ఆయిల్ కొనేందుకు పోటెత్తుతున్నారు: ట్రంప్

అమెరికన్ క్రూడ్ ఆయిల్ కొనేందుకు భారీ ట్యాంకర్లు తరలివస్తున్నాయని ట్రంప్ అన్నారు. వీటికి ఆయిల్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సౌదీ, రష్యాల కంటే తమ వద్ద ఎక్కువ నిల్వలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. US క్రూడ్ ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైనదన్న ట్రంప్.. ఇది స్వీటెస్ట్ ఆయిల్ అని పేర్కొన్నారు. హార్ముజ్ రీఓపెనింగ్పై పాక్లో ఇరాన్-US మధ్య చర్చలు జరగనున్న వేళ ట్రంప్ ఈ పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.
News April 11, 2026
మృతుడి ‘ఆధార్’ను డీయాక్టివేట్ ఎలా చేయాలి?

ఎవరైనా చనిపోయాక వారి ఆధార్ను డీయాక్టివేట్ చేయడం ముఖ్యం. లేదంటే ఆ నంబర్ ఆధారంగా దుండగులు సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉంది.
✒ https://myaadhaar.uidai.gov.in/లోకి వెళ్లి కుటుంబీకుల్లోని ఒకరి ఆధార్తో లాగిన్ అవ్వాలి.
✒ ‘రిపోర్ట్ డెత్ ఆఫ్ ఎ ఫ్యామిలీ నంబర్’ ఆప్షన్ను ఎంచుకొని మృతుడి వివరాలు నమోదు చేయాలి.
✒ డెత్ రిజిస్ట్రేషన్ నంబర్ను ఎంటర్ చేసి, సర్టిఫికెట్ను అప్లోడ్ చేస్తే సరిపోతుంది.
#ShareIt


