News December 27, 2024
కుంభమేళాకు 16 ప్రత్యేక రైళ్లు

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ తదితర ప్రాంతాల్లో జనవరి, ఫిబ్రవరిలో జరిగే మహా కుంభమేళాను పురస్కరించుకుని SCR 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని గుంటూరు, మౌలాలి, కాచిగూడ నుంచి వివిధ తేదీల్లో బయల్దేరే ఈ రైళ్లు గయ, పాట్నా, అజంగఢ్ వరకు ప్రయాణిస్తాయి. రైళ్లు ప్రయాణించే తేదీలు, హాల్టింగ్ల వివరాలను పైనున్న ఫొటోల్లో చూడవచ్చు.
Similar News
News December 6, 2025
హిట్ మ్యాన్@ 20,000 రన్స్

SAతో మూడో వన్డేలో రోహిత్ శర్మ కీలక మైలురాయిని చేరుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్(టెస్టు, వన్డే, T20)లో 20,000 పరుగులు చేసిన నాలుగో ఇండియన్ ప్లేయర్గా నిలిచారు. కేశవ్ వేసిన 14 ఓవర్ నాలుగో బంతికి సింగిల్ తీసి ఈ ఘనత సాధించారు. సచిన్(34,357), కోహ్లీ(27,910), ద్రవిడ్(24,064) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. కాగా ప్రస్తుత మ్యాచ్లో భారత్ నిలకడగా ఆడుతోంది. క్రీజులో జైస్వాల్(38), రోహిత్(50) ఉన్నారు.
News December 6, 2025
నెలసరి లీవ్స్.. మన రాష్ట్రంలో అమలు చేస్తారా?

TG: కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య నెలసరి ప్రయోజన బిల్లు-2024(ప్రైవేట్)ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. మహిళలకు నెలసరి సమయంలో 4 రోజుల పెయిడ్ లీవ్స్తో పాటు బ్రేక్స్, పనిచేసే ప్రాంతాల్లో సౌకర్యాల కల్పన, హక్కులు ఉల్లంఘిస్తే కంపెనీలకు భారీగా జరిమానాలు విధించాలని బిల్లు కోరుతోంది. ఇప్పటికే కర్ణాటక, బిహార్, ఒడిశా ప్రభుత్వాలు ఈ తరహా సెలవులు ఇస్తుండగా తెలంగాణలోనూ ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది.
News December 6, 2025
BRSపై ఏడుపు తప్ప CM చేసిందేముంది: హరీశ్

TG: CM అబద్ధాల ప్రచారంతో వాస్తవాలు మరుగున పడిపోవని, KCR చేసిన సంక్షేమాన్ని ప్రజలు మర్చిపోరని హరీశ్ రావు తెలిపారు. రెండేళ్లుగా BRSపై ఏడ్వడం తప్ప రేవంత్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ‘అనాలోచిత నిర్ణయాలతో SLBCలో 8మంది ప్రాణాలు బలిగొన్నారు. కృష్ణా నీళ్లను AP అక్రమంగా తరలించుకుపోతున్నా, DPRలు రూపొందిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఫుట్బాల్ ఆటపై ఉన్న శ్రద్ధ పాలనపై లేకపోవడం సిగ్గుచేటు’ అని ధ్వజమెత్తారు.


