News May 24, 2024

16,344 వడదెబ్బ కేసులు.. 60 మరణాలు

image

ఈ వేసవిలో కొన్నిచోట్ల వర్షాలు పడుతున్నప్పటికీ మరికొన్ని చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి 1 నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 16,344 వడదెబ్బ కేసులు నమోదు కాగా.. 60 మంది ప్రాణాలు కోల్పోయారని నేషనల్ సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ నివేదిక తెలిపింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో గురువారం 48.8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత ఇదే.

Similar News

News October 23, 2025

జుట్టు ఆరోగ్యానికి ఆముదం

image

ప్రస్తుతకాలంలో చాలామంది జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. వాటికి ఆముదం పరిష్కారం చూపుతుందంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే రిసినోలిక్ యాసిడ్, విటమిన్-ఇ , ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్లు మాడుపై రక్తప్రసరణను పెంచి జుట్టు వేగంగా పెరిగేలా చేస్తుంది. అలాగే మాడుపై అలెర్జీ, వాపులను తగ్గించి తేమగా ఉండేలా చూస్తుంది. స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను నివారించి జుట్టును ఆరోగ్యంగా చేస్తుందని చెబుతున్నారు. <<-se>>#Haircare<<>>

News October 23, 2025

ఇతిహాసాలు క్విజ్ – 44 సమాధానాలు

image

1. భరతుని మేనమామ ‘యధాజిత్తు’.
2. ఉత్తరుడు మత్స్య దేశపు రాజు అయిన విరాటరాజు, సుధేష్ణల కుమారుడు.
3. బ్రహ్మ నివసించే లోకం పేరు ‘సత్య లోకం’.
4. గరుడ పక్షి విష్ణువు వాహనం.
5. భారతదేశంలోని ఏకైక బ్రహ్మ ఆలయం రాజస్థాన్‌లోని పుష్కర్‌లో ఉంది.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 23, 2025

ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు క్యాబినెట్ ఆమోదం

image

TG: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు వీలుగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018లో సెక్షన్ 21(3)ని తొలగించాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే పలువురు మంత్రులు ప్రకటించగా తాజాగా సీఎం అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గ సమావేశంలో అధికారికంగా ధ్రువీకరించారు.