News August 24, 2025
16,347 పోస్టులు.. ఇవాళ అభ్యర్థులకు కాల్ లెటర్లు

AP: డీఎస్సీలో మెరిట్ అభ్యర్థులకు ఇవాళ కాల్ లెటర్లు అందనున్నాయి. వెబ్సైట్లో వీటిని విద్యాశాఖ అందుబాటులో ఉంచనుంది. పోస్టుకు ఒకరు చొప్పున వెరిఫికేషన్కు పిలవనుంది. రేపటి నుంచి జిల్లాల్లో వెరిఫికేషన్ ప్రారంభమవుతుంది. 2-3 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ చూస్తోంది. వెరిఫికేషన్కు హాజరు కాని, సర్టిఫికెట్లు సమర్పించని వారి స్థానంలో మెరిట్ జాబితాలోని మిగతా వారికి అవకాశం కల్పిస్తారు.
Similar News
News August 24, 2025
GREAT: నలుగురు అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు

AP: చదువుతో పేదరికాన్ని జయించొచ్చని నిరూపించారు చిత్తూరు జిల్లాకు చెందిన అక్కాచెల్లెళ్లు. వేపమాకులపల్లికి చెందిన గౌరమ్మకు నలుగురు కూతుళ్లు. పదేళ్ల కిందట భర్త చనిపోవడంతో కూలీ పనులు చేస్తూ బిడ్డలను చదివించారు. పెద్ద కూతురు వీణ 2014లో కానిస్టేబుల్ జాబ్ సాధించారు. 2016లో వాణి SGTగా ఎంపికయ్యారు. నెల క్రితం వనజాక్షి కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలక్ట్ కాగా, తాజాగా డీఎస్సీలో శిరీష SGT పోస్ట్ సాధించారు.
News August 24, 2025
HMS గౌరవ అధ్యక్షురాలిగా కవిత?

TG: MLC కవిత హిందూ మజ్దూర్ సభ గౌరవ అధ్యక్షురాలిగా నియమితులయ్యే అవకాశం ఉంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలి(TBGKS)గా ఆమె అందించిన సేవలకు గుర్తుగా HMS అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని సంఘం నాయకులు నిర్ణయించారు. AUG 31న మంచిర్యాల(D) శ్రీరాంపూర్లో జరిగే సమావేశంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఇటీవలే TBGKS అధ్యక్షురాలిగా ఉన్న ఆమెను తొలగించి, కొప్పుల ఈశ్వర్ను ఎన్నుకున్నారు.
News August 24, 2025
పవన్ కళ్యాణ్ OG నుంచి అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘OG’ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ను చిత్ర యూనిట్ ఇవాళ సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనుంది. ‘తుఫాన్ ఆగిపోయింది.. ఇప్పుడు గాలి వీస్తోంది’ అంటూ సెకండ్ సింగిల్పై అంచనాలు పెంచేసింది. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించగా, DVV దానయ్య నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న ఈ మూవీ రిలీజ్ కానుంది.