News September 10, 2024

నేరుగా అకౌంట్లలోకే రూ.16,500: మంత్రి

image

TG: రాష్ట్రంలో సంభవించిన వరదల వల్ల 358గ్రామాల్లో దాదాపు 2లక్షల మంది నష్టపోయారని మంత్రి పొంగులేటి అన్నారు. వర్షాలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలోనే రూ.16,500 జమ చేస్తామన్నారు. అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా వరద <<14062097>>సాయాన్ని<<>> అందిస్తామన్నారు. భూపత్రాలు, రేషన్, ఆధార్ కార్డులతో పాటు ఇతర పత్రాలు కోల్పోయిన వారు పోలీస్ స్టేషన్లలో దరఖాస్తు చేసుకుంటే డూప్లికేట్ ఇస్తామన్నారు.

Similar News

News November 20, 2025

ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్‌ను కలిసిన కేయూ JAC

image

కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్‌గా పి.భాస్కర్ నూతనంగా నియామకమయ్యారు. ఈ సందర్బంగా కేయూ జేఏసీ నాయకులు గురువారం ఆయనను కలిశారు. ప్రిన్సిపల్‌ను శాలువాతో సన్మానించి, పూలమొక్క అందచేసి, శుభాకాంక్షలు తెలిపారు. డిపార్ట్మెంట్ అభివృద్ధి కోసం పనిచేయాలని, ఉన్నత శిఖరాలకు ఎదిగేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని వారు ప్రిన్సిపల్‌ను కోరారు.

News November 20, 2025

అందుకే రూపాయి పతనమైంది: RBI గవర్నర్

image

డాలర్‌కు డిమాండ్ పెరగడం వలనే రూపాయి పతనమైందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. రూపాయి విలువను నిర్దిష్టంగా లెక్కించడం లేదని స్పష్టం చేశారు. అమెరికన్ కరెన్సీకి విలువ పెరగడం వల్లే రూపాయి విలువ తగ్గిందన్నారు. మార్కెట్ ఎలా జరుగుతోంది అనే దానిపైనే రూపాయి విలువ ఆధారపడి ఉంటుందని చెప్పారు. డాలర్‌కు డిమాండ్ పెరిగితే రూపాయి విలువ తగ్గినట్టే, రూపాయి డిమాండ్ పెరిగితే డాలర్ పతనమవుతుందని తెలిపారు.

News November 20, 2025

ఓట్ చోర్, SIRపై సందేహాలను నివృత్తి చేయాలి: మాజీ సీఈసీ

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోర్, SIR ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్‌పై ఉందని మాజీ సీఈసీ ఖురేషి తెలిపారు. ఆరోపణలపై పూర్తి స్థాయిలో నివృత్తి చేసి ప్రజాస్వామ్యంపై ఉన్న విశ్వాసాన్ని కాపాడాలని కోరారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని, ప్రత్యారోపణలు చేయడం సరైనది కాదని ఓ పాడ్‌కాస్ట్‌లో అన్నారు. 2010-12 మధ్య ఖురేషీ సీఈసీగా పని చేశారు.