News January 16, 2025

17న కృష్ణా జిల్లాకు కేంద్రమంత్రి అమిత్ షా

image

కేంద్ర మంత్రి అమిత్‌షా ఈనెల 17,18 కృష్ణాజిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 17 రాత్రికి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లి వెళ్లి సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. 18వ తేదీ గన్నవరం మండలంలోని కొండపావులూరులో నూతనంగా నిర్మించిన NIDM, NDRF, 10వ బెటాలియన్ ప్రాంగణాలను ఆయన ప్రారంభించనున్నారు. 

Similar News

News December 4, 2025

కృష్ణా జిల్లా అమర గాయకుడు జయంతి నేడు

image

అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా సంగీతాభిమానులు ఆయనను స్మరించుకుంటున్నారు. 1922 డిసెంబర్ 4న కృష్ణా జిల్లా చౌటపల్లిలో జన్మించిన ఘంటసాల, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా తెలుగు పాటకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. అనేక భాషల్లో ఆయన ఆలపించిన గీతాలు నేటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. “చివరి శ్వాస వరకు గానం చేస్తాను” అన్న ఆయన మాటలు సంగీతాభిమానులను ముద్దుపెట్టుకుంటూనే ఉన్నాయి.

News December 3, 2025

కృష్ణా: డీసీసీ అధ్యక్షుల రేసులో అందె, శొంఠి

image

కాంగ్రెస్ పార్టీ పునః నిర్మాణంలో భాగంగా తొలుత డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టనుంది. కృష్ణాజిల్లా డీసీసీ పదవికి ఆశావహులు పోటీపడుతున్నారు. ప్రధానంగా అవనిగడ్డకు చెందిన అందే శ్రీరామ్మూర్తి, పెడనకు చెందిన శొంఠి నాగరాజు రేసులో ముందు ఉన్నారు. డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఇటీవలే జిల్లాకు పరిశీలకునిగా వచ్చిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సంజయ్ దత్ మచిలీపట్నం వచ్చి అభిప్రాయసేకరణ చేపట్టి వెళ్లారు.

News December 3, 2025

20 కేంద్రాల్లో NMMS పరీక్ష: డీఈఓ

image

ఈనెల 7వ తేదీన జిల్లాలో నిర్వహించనున్న నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని డీఈఓ PVJ రామారావు తెలిపారు. జిల్లాలో మొత్తం 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 4040 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. మచిలీపట్నం డివిజన్‌లో 9 కేంద్రాల్లో 1838 మంది, గుడివాడ డివిజన్‌లో 6కేంద్రాల్లో 1213 మంది, ఉయ్యూరు డివిజన్‌లో 5 కేంద్రాల్లో 989 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు.