News October 16, 2024

17న నీతి అయోగ్ సీఈవో విశాఖ రాక

image

ఈనెల 17వ తేదీన నీతి అయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యం విశాఖ వస్తున్నారు. ఆయన ఢిల్లీ నుంచి రాత్రి 10.15 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన నగరానికి వెళ్లి బస చేస్తారు. 18వ తేదీన సీఈవో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదే రోజు రాత్రి 11.10 గంటలకు తిరిగి ఢిల్లీ వెళతారు.

Similar News

News December 20, 2025

మధురవాడలో తెల్లవారుజామున యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

మధురవాడలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భీమిలి మండలం పెద్దవీధికి చెందిన పూసర్ల లక్ష్మణరావు (79) అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మణరావు వల్లినగర్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. శనివారం తెల్లవారుజామున 5:30 గంటలకు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ జంక్షన్ సమీపంలో సర్వీస్ రోడ్డులో వెళుతుండగా వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనపై పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News December 20, 2025

విశాఖ సిటీ పోలీస్ వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం

image

విశాఖపట్నం సిటీ పోలీస్ ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు చేరువయ్యింది. 95523 00009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపి ఈ-చలాన్ చెల్లింపులు, ఎఫ్‌.ఐ.ఆర్ డౌన్‌లోడ్, కేసు స్టేటస్ వంటి సేవలను మీ ఫోన్ నుండే పొందవచ్చు. పారదర్శకత, వేగవంతమైన సేవల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని పోలీసులు తెలిపారు. తక్షణ సహాయం కోసం ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

News December 20, 2025

అదుపుతప్పిన నేవి ప్యారాచూట్.. కోరమాండల్‌లో ఉద్యోగి ల్యాండ్

image

నేవీ ఉద్యోగి పారాచూట్‌పై ఐఎన్ఎస్ డేగా నుంచి ఎగురుతూ అదుపుతప్పి కోరమండల్ పరిశ్రమ ఆవరణలో దిగిపోవడంతో సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. సాంకేతిక లోపంతో కోరమండల్ గేట్ నెంబర్ 10 వద్ద ఉద్యోగి దిగిపోవడంతో కంగారుపడిన సెక్యూరిటీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగి ఐడీ కార్డు చూపించడంతో నేవీ అధికారులకు అప్పగించారు.