News December 11, 2024
17న HYDకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది నేపథ్యంలో HYD రానున్న దృష్ట్యా జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ కోరారు. శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు ఉంటారని వివరించారు. జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, మల్కాజిగిరి, కీసర ఆర్డీవోలు శ్యాంప్రకాష్, సైదులు, ఎసీపీ రాములు పాల్గొన్నారు.
Similar News
News November 23, 2025
ఇలా అయితే భవిష్యత్లో HYDకు గండమే!

ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాల వరద ప్రవాహాంతో వచ్చే వ్యర్థాలు అడుగున చేరి నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గుతోంది. ఇటీవల నీటి వనరుల విభాగం ఉన్నతస్థాయి కమిటీ పరిశీలనలో భారీగా పూడిక పేరుకుపోయి నీటి సామర్థ్యం సాధారణ స్థాయి కంటే తగ్గుముఖం పట్టినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నీటి సామర్థ్యం 60% కంటే దిగువకు పడిపోతే భవిష్యత్తులో నీటి తరలింపు సమస్యగా మారే ప్రమాదం ఉందని వెల్లడైంది.
News November 23, 2025
HYD: 25న బల్దియా సర్వసభ్య సమావేశం

మరో రెండున్నర నెలల్లో జీహెచ్ఎంసీ పాలకమండలి ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో ఈ నెల 25న సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఆమోదానికి మాత్రం ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో చివరి సమావేశం కావడంతో ప్రధాన ప్రతిపక్షమైన BRSకు, కాంగ్రెస్కు మధ్య మాటల యుద్ధం తప్పకపోవచ్చని సమాచారం.
News November 23, 2025
DANGER: HYDలో వాటర్ హీటర్ వాడుతున్నారా?

వాటర్ హీటర్ ప్రమాదాలు నగరంలో కలవరపెడుతున్నాయి. పోలీసుల వివారలిలా.. మియాపూర్ దావులూరి హోమ్స్లో హౌస్కీపింగ్ ఉద్యోగిని శివలీల (32) శనివారం వాటర్ హీటర్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడి మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత హీటర్లతో ప్రమాదాలు జరుగుతున్నాయని, నాణ్యమైనవి కొనాలని, చేతులు తుడుచుకుని, చెప్పులు ధరించి స్విచ్ఆఫ్ చేశాకే ప్లగ్ పట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


