News December 11, 2024
17న HYDకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది నేపథ్యంలో HYD రానున్న దృష్ట్యా జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ కోరారు. శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు ఉంటారని వివరించారు. జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, మల్కాజిగిరి, కీసర ఆర్డీవోలు శ్యాంప్రకాష్, సైదులు, ఎసీపీ రాములు పాల్గొన్నారు.
Similar News
News October 18, 2025
HYD: జిమ్లలో ‘మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్’ దుర్వినియోగంపై చర్యలు

సికింద్రాబాద్లోని నామాలగుండులో అక్రమంగా నిల్వచేసి విక్రయించిన ‘మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్’ నిల్వలను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎం.నరేశ్ అనే మెడికల్ వ్యాపారి నుంచి గుండె ఉద్దీపన మందులు-టెర్మిన్ ఇంజెక్షన్లు, టెర్మివా ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. బాడీబిల్డింగ్లో దుర్వినియోగం కోసం ఈ మందులను జిమ్కు వెళ్లేవారికి చట్టవిరుద్ధంగా విక్రయిస్తున్నారు.
News October 18, 2025
HYD: నవీన్ యాదవ్ ఆస్తులు రూ.29.66 కోట్లు

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. నామినేషన్తోపాటు తన అఫిడవిట్ దాఖలు చేశారు. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.29.66 కోట్లు, రూ.5.75 కోట్లు భార్య పేరిట ఉన్నాయన్నారు. తనకు అప్పులు రూ.75 లక్షలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. తనపై 7 క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా వెల్లడించారు. 18.69 ఎకరాల వ్యవసాయ భూమి, యూసుఫ్గూడలో 860 గజాల ఇంటి స్థలం ఉందన్నారు.
News October 18, 2025
HYD: సంపులో పడి చిన్నారి మృతి.. జర జాగ్రత్త..!

HYD నానక్ రాంగూడలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. టీఎన్జఓ కాలనీలో ఉండే పరమేశ్వర్, సంధ్యారాణి దంపతులకు కుమారుడు నిఖిల్ తేజ(4) ఉన్నాడు. ఈ క్రమంలో అంగన్వాడికి వెళ్లిన నిఖిల్ పక్కనే ఉన్న సంపులో ఆడుతూ పడిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో మృతిచెందాడు. కొద్దిసేపు తర్వాత తల్లిదండ్రులు వెతకడంతో సంపులో మృతదేహం లభించింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.