News February 12, 2025
17వ తేదీ నుంచి ఓయూ సెల్ట్ తరగతులు

ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో ఈ నెల 17వ తేదీ నుంచి తరగతులను నిర్వహించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సవిన్ సౌడ తెలిపారు. రెండు నెలల ఈ కోర్సుకు ప్రతిరోజూ ఉదయం ఆరున్నర గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తరగతులు నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న వారు 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 79899 03001, 98497 52655 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Similar News
News March 15, 2025
రంగారెడ్డి: ఇంటర్ పరీక్షకు 759 మంది గైర్హాజరు

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 185 సెంటర్లలో 62,053 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 61,294 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 759 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారన్నారు. జిల్లావ్యాప్తంగా ఒక్క మాల్ ప్రాక్టీస్ కేసు కూడా నమోదు కాలేదన్నారు.
News March 15, 2025
HYD: ముప్పుగా మారుతున్న స్టంట్స్

రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి PVNR ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 276 వద్ద నుంచి డైరీ ఫామ్ రూట్లో కొంతమంది మైనర్లు నాలుగు వాహనాలపై ప్రమాదకరమైన ఫీట్లు (స్టంట్స్) చేస్తున్నారు. వీరి విన్యాసాలను చూసిన ఇతర వాహనదారులు భయపడుతున్నారు. ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.
News March 15, 2025
UPDATE: మనవడి పుట్టినరోజున తాత సూసైడ్

మియాపూర్ PS పరిధిలో వ్యక్తి <<15762457>>ఆత్మహత్యకు<<>> పాల్పడిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. నిజామాబాద్ జిల్లాకు చెందిన రాఘవేందర్ రావు దీప్తిశ్రీనగర్లో నివాసముంటున్నారు. శుక్రవారం రాఘవేందర్ రావు మనవడు పుట్టినరోజు కావడంతో వేడుకలు నిర్వహించుకోవాలని కుటుంబ సభ్యులు షాపింగ్కు వెళ్లగా అతను ఇంట్లోనే ఉన్నాడు. షాపింగ్ నుంచి కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి చూడగా ఉరేసుకొని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.