News December 11, 2024

17న విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

image

ఈ నెల 17న విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నట్లు సీఎస్ నీరభ్‌కుమార్ తెలిపారు. మంగ‌ళ‌వారం రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతార‌న్నారు. ఈనెల 17న ఉదయం 11.20 గంటలకు విజయవాడకు చేరుకొని అక్క‌డి నుంచి రోడ్డు మార్గంలో మంగ‌ళ‌గిరి వెళ్త‌ర‌ని చెప్పారు. మధ్యాహ్నం 12.05 గంటలకు స్నాతకోత్సవంలో పాల్గొననున్నట్లు తెలిపారు.

Similar News

News November 8, 2025

మచిలీపట్నం: కలెక్టరేట్‌లో భక్త కనకదాసు జయంతి

image

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం కలెక్టరేట్ మీటింగ్ హాలులో భక్త కనకదాసు జ‌యంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్య దైవంగా నిలిచిన భక్త కనకదాసు కర్ణాటకలోని గొప్ప భక్తుడు, ఆధునిక కవి, యోధుడు అని తెలిపారు.

News November 8, 2025

కోడూరు: కూలికి వెళ్లి అనంత లోకాలకు..!

image

వ్యవసాయ కూలి పనుల వెళ్లి విగత జీవిగా యువకుడు కాటికి చేరిన సంఘటన కోడూరు మండలం గొల్లపాలెం గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓలేటి ఇంద్ర బాబు(27), ఇతర వ్యవసాయ కార్మికులతో ఇటీవల చిత్తూరు జిల్లా రేణిగుంట వ్యవసాయ కూలీ పనులకు వెళ్లాడు. శుక్రవారం వ్యవసాయ పనులు చేస్తున్న క్రమంలో కరెంటు షాక్ గురై అక్కడకక్కడే మృతి చెందాడని ఇంద్రబాబు కుటుంబ సభ్యులు తెలిపారు.

News November 8, 2025

నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని ప్రభుత్వ భవనాల్లో చేపట్టిన వివిధ నిర్మాణ పనులను, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని కలెక్టర్ డీ.కే. బాలాజి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ‘మీ-కోసం’ హాల్లో సీఎస్‌ఆర్ నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఆలస్యమైన పనులను త్వరగా పూర్తి చేయాలని ఏజెన్సీలను సూచించారు.