News February 8, 2025
17 మంది అభ్యర్థులు-23 సెట్ల నామినేషన్లు

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నామినేషన్లు ఊబందుకున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 17 మంది అభ్యర్థులు 23 సెట్లు నామినేషన్లు వేశారు. ఈరోజు, రేపు సెలవు ఉండడంతో నామినేషన్కు 10న ఒక్క రోజే గడువు ఉంది.
Similar News
News November 29, 2025
సిరిసిల్ల : బైపాస్లో టైరు పేలి కారు బోల్తా

సిరిసిల్ల – వెంకటాపూర్ బైపాస్ రోడ్డులో కారు టైరు పేలడంతో బోల్తా పడింది. శుక్రవారం వాలీబాల్ అకాడమీ కోచ్ సంపత్ కుమార్ కరీంనగర్ నుంచి సిరిసిల్లకు కారులో వస్తున్నారు. ఒక్కసారిగా కారు టైరు పేలిపోవడంతో అదుపుతప్పడంతో స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది. కారులో ఉన్న సంపత్ కుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
News November 28, 2025
PDPL: ‘రిజిస్ట్రేషన్ లేని ఆసుపత్రులపై కఠిన చర్యలు’

జిల్లా వైద్య అధికారి డా.వి.వాణిశ్రీ పెద్దపల్లిలో సాయి వంశీ, ప్రణీత్ పిల్లల హాస్పిటల్, శ్రీ రాజేశ్వరి డయాగ్నొస్టిక్లను తనిఖీ చేశారు. రికార్డులు, రిపోర్ట్స్, కేసు చీట్స్ పరిశీలించారు. బయోమెడికల్ వేస్టేజ్ నియమాల ప్రకారం మేనేజ్ చేయాలన్నారు. ‘రిజిస్ట్రేషన్ ప్రకారం బెడ్లు ఉండాలి. టారిఫ్ బోర్డు ధరల ప్రకారం ఫీజు తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ లేని సౌకర్యాలపై చర్యలు, పెనాల్టీ విధించబడుతుంది’ అని హెచ్చరించారు.
News November 28, 2025
HYD: కొడుకుతో కలిసి భర్తను చంపిన భార్య (UPDATE)

బోడుప్పల్లో భర్తను భార్య దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. స్థానికుల ప్రకారం.. అంజయ్య(55)కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. నెల క్రితం కూతురి వివాహమై పుట్టింట్లో ఉంది. గురువారం రాత్రి భార్య బుగమ్మ, కుమారుడు రాజు, బంధువు శేఖర్తో కలిసి అంజయ్య మద్యం తాగారు. అర్ధరాత్రి ముగ్గురు అతడి మెడకు చున్నీ బిగించి హతమార్చారు. కూతురు అడ్డుకోగా గదిలో బంధించారు. పోలీసులకు ఫిర్యాదుతో వెలుగులోకొచ్చింది.


