News February 8, 2025

17 మంది అభ్యర్థులు-23 సెట్ల నామినేషన్లు

image

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నామినేషన్లు ఊబందుకున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 17 మంది అభ్యర్థులు 23 సెట్లు నామినేషన్లు వేశారు. ఈరోజు, రేపు సెలవు ఉండడంతో నామినేషన్‌కు 10న ఒక్క రోజే గడువు ఉంది.

Similar News

News October 17, 2025

జగిత్యాల: రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్రగాయాలు

image

JGTL(D) వెల్గటూర్ మండలం కొత్తపల్లి వద్ద రాష్ట్ర రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్గటూర్ నుంచి రాయపట్నం వైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి కిందపడి, తలకు తీవ్ర గాయాలై, తీవ్ర రక్తస్రావమైంది. కొన ఊపిరితో ఉన్న బాధితుడిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 17, 2025

కొబ్బరి బొండాల సేకరణ మంచి ఆదాయం: కలెక్టర్

image

ఏలూరు జిల్లా ప్రజలకు రక్షిత మంచినీటిని 2 పూటల అందించాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం మాట్లాడుతూ.. రైతుకు అవసరం అయ్యే అభివృద్ధి పనులుపై దృష్టి సారించాలని ఆదేశించారు. చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలు సమర్దవంతంగా పనిచేయాలన్నారు. ప్లాస్టిక్ వస్తువులు, కొబ్బరి బొండాలు సేకరించాలని, అవి మంచి ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. క్లాప్ మిత్రలకు ప్రజలు సహకరించాలన్నారు.

News October 17, 2025

లోకేశ్‌ ట్వీట్‌కు కౌంటరిచ్చిన సిద్దరామయ్య

image

APలో పెట్టుబడులపై మంత్రి లోకేశ్ చేసిన <<18020050>>ట్వీట్‌<<>> తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. తాజాగా కర్ణాటక CM సిద్దరామయ్య కౌంటరిచ్చారు. ‘ఇన్వెస్టర్లు తమకు నచ్చిన చోట పెట్టుబడులు పెడతారు. యాపిల్ సంస్థ కర్ణాటకలో ఇన్వెస్ట్ చేసింది.. ఆంధ్రప్రదేశ్‌లో కాదు’ అని వ్యాఖ్యానించారు. అంతకుముందు లోకేశ్‌ను ఎద్దేవా చేస్తూ కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేతో పాటు KN, TN నెటిజన్లు <<18027162>>ట్వీట్లు<<>> చేశారు.