News February 8, 2025
17 మంది అభ్యర్థులు-23 సెట్ల నామినేషన్లు

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నామినేషన్లు ఊబందుకున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 17 మంది అభ్యర్థులు 23 సెట్లు నామినేషన్లు వేశారు. ఈరోజు, రేపు సెలవు ఉండడంతో నామినేషన్కు 10న ఒక్క రోజే గడువు ఉంది.
Similar News
News April 14, 2026
ఫ్యాటీ లివర్.. A Big Problem.. లక్షణాలు, నివారణ

ప్రపంచవ్యాప్తంగా ఫ్యాటీ లివర్ సమస్య పట్టిపీడిస్తోంది. ప్రస్తుతం 130Cr మంది ఈ వ్యాధి(MASLD)తో బాధపడుతుండగా 2050 నాటికి ఈ సంఖ్య 200Crకు చేరొచ్చని ‘ది లాన్సెట్’ అంచనా వేసింది. లిక్కర్ అలవాటు లేకపోయినా కొవ్వు పేరుకుపోవడం, ఒబెసిటీ, టైప్ 2 డయాబెటిస్, బీపీ వల్ల ఇది వస్తుంది. కామెర్లు, అలసట, ఆకలి లేకపోవడం, బరువు తగ్గుదల దీని లక్షణాలు. డాక్టర్ సూచన మేరకు జీవనశైలి మార్పులు, మందులతో అదుపులో ఉంచుకోవచ్చు.
News April 14, 2026
తిరుపతి గంగమ్మ జాతర తొలి వారం ప్రారంభం

తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మే నెలలో వారం రోజుల పాటు ఘనంగా జరుగనుంది. జాతర ముందు మూడు వారాలు, జాతర తరువాత ఐదు వారాలు మారు పొంగళ్లు పెట్టడం ఆనవాయితీ. ఇందులో భాగంగా తొలి వారం ప్రారంభం కావడంతో ప్రత్యేక అభిషేకాలు, విశేషాలంకరణలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటున్నారు.
News April 14, 2026
బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్: అచ్చెన్న

అంబేడ్కర్ ఆశయాలు కొనసాగిద్దామని మంత్రి అచ్చెన్న అన్నారు. శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ కూడలిలో మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అంబేడ్కర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాలకు న్యాయం చేయడం లక్ష్యమని అచ్చెన్న అన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు.


