News February 8, 2025
17 మంది అభ్యర్థులు-23 సెట్ల నామినేషన్లు

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నామినేషన్లు ఊబందుకున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 17 మంది అభ్యర్థులు 23 సెట్లు నామినేషన్లు వేశారు. ఈరోజు, రేపు సెలవు ఉండడంతో నామినేషన్కు 10న ఒక్క రోజే గడువు ఉంది.
Similar News
News December 7, 2025
గన్నవరం ఎయిర్ పోర్టులో కొత్త ఏటీసీ టవర్ సిద్ధం

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ సిద్ధమయింది. శాశ్వత ప్రాతిపదికన నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్కు అనుబంధంగా దీనిని నిర్మించారు. కొత్త టెర్మినల్ బిల్డింగ్ అందుబాటులోకి రాగానే దీనిని వినియోగిస్తారు. ఇప్పటికే ఎయిర్ పోర్ట్లో కొత్త ఆప్రాన్ సిద్ధమైంది. సంక్రాంతి నాటికి కొత్త ట్రిమ్మర్ అందుబాటులోకి వస్తుంది.
News December 7, 2025
హనుమాన్ చాలీసా భావం – 31

అష్ట సిద్ధి నవ నిధి కే దాతా|
అసవర దీన్హ జానకీ మాతా||
హనుమంతుడు 8 రకాల సిద్ధులు, 9 రకాల సంపదలు ఇవ్వగలిగే సామర్థ్యం కలవాడు. ఈ అద్భుతమైన, అత్యున్నతమైన వరాన్ని సాక్షాత్తు సీతాదేవి లంకలో ప్రసాదించింది. కాబట్టి, హనుమంతుడు తన భక్తులకు అన్ని రకాల శక్తులను, సంపదలను, కోరిన కోరికలను తీర్చగలిగే శక్తిమంతుడు అని మనం గ్రహించాలి. <<-se>>#HANUMANCHALISA<<>>
News December 7, 2025
NTR: ఏడాదిలో 600కి పైగా రోడ్డు ప్రమాదాలు

ఈ ఏడాది NTR జిల్లాలో 600కు పైగా రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. అతివేగం, మద్యం తాగి డ్రైవింగ్, హెల్మెట్/సీట్ బెల్ట్ ధరించకపోవడం ప్రధాన కారణాలుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా సాయంత్రం 6-9, మధ్యాహ్నం 3-6 సమయాల్లో ప్రమాదాలు అధికం. వాహనాలకు ఫిట్నెస్ టెస్టులు వంటి నివారణ చర్యలు తీసుకుంటే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


