News May 10, 2024
17 సార్లు ఎన్నికలు.. నామాదే అత్యధిక మెజార్టీ

ఖమ్మం MP స్థానంలో ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు 4 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచారు. ఆయన 2019 ఎన్నికల్లో సాధించిన మెజార్టీనే ఇప్పటి వరకు అత్యధికం. ఆయన తన సమీప ప్రత్యర్థి రేణుకా చౌదరిపై 1,68,062 ఓట్ల మెజార్టీ సాధించారు. ఆ ఎన్నికల్లో నామాకు 5,67,459 ఓట్లు రాగా, రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు వచ్చాయి.
Similar News
News February 6, 2025
రామయ్య హుండీ ఆదాయం రూ.1,13,23,178

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని 37 రోజుల తర్వాత గురువారం లెక్కించగా రూ.1,13,23,178 లు వచ్చినట్లు ఈవో రమాదేవి తెలిపారు. అంతేకాకుండా 109 గ్రాముల బంగారం, 895 గ్రాముల వెండి, 298 యూఎస్ డాలర్లు, 155 సింగపూర్ డాలర్లు, 430 యూఏఈ దీరమ్స్, 20 కెనడా డాలర్లు, 85 ఆస్ట్రేలియా డాలర్లు, 45 యూరప్ యూరోస్ కూడా భక్తులు సమర్పించినట్లు పేర్కొన్నారు.
News February 6, 2025
KMM: 1,04,995 మందికి రైతు భరోసా నిధులు జమ

తెలంగాణ ప్రభుత్వం యాసంగి సాకు కింద రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మండలాలు, గ్రామాల వారీగా ఒక ఎకరం వరకు సాగులో ఉన్న రైతుల ఖాతాలో నగదు జమ చేసింది. ఖమ్మం జిల్లాలో ఎకరంలోపు భూమి ఉన్న 1,04,995 మంది రైతుల ఖాతాలలో రూ.58,22,56,809 జమయ్యాయి. గతంలో రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున అందిస్తుండగా, ప్రస్తుతం రూ.6 వేలకు పెంచిన విషయం తెలిసిందే.
News February 6, 2025
వరుస ప్రశంసలతో దూసుకెళ్తున్న ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తన పనితీరు, వ్యక్తిత్వంతో వరుస ప్రశంసలు అందుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం గురుకు పాఠశాలను సందర్శించి విద్యార్థులతో పాటు నేలపై కూర్చొని సూచనలు ఇచ్చారు. తరువాత రైతు అవతారం ఎత్తి పొలాల బాట పట్టి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. తాజాగా ఖమ్మం ఎన్నెస్పీ ప్రభుత్వ స్కూల్ సందర్శించి విద్యార్థులతో పాటు నేలపై కూర్చొన్ని మోటివేషన్ క్లాసులు విన్నారు.