News November 18, 2025

17 ఏళ్ల వయసులోనే దళంలోకి..

image

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన <<18318593>>హిడ్మా<<>> గురించి కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా ఏళ్లుగా గాలిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ దక్షిణ బస్తర్ జిల్లా పూవర్తికి చెందిన హిడ్మా మావోలు నడిపే స్కూళ్లో చదివి, 1996-97 మధ్య 17 ఏళ్ల వయసులోనే దళంలోకి వెళ్లాడు. ఏడో తరగతి వరకే చదివినా.. ఓ లెక్చరర్ ద్వారా ఇంగ్లిష్ నేర్చుకున్నాడు. ఆయుధాల తయారీ, రిపేర్లలో దిట్ట. అంచెలంచెలుగా ఎదిగి.. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా మారాడు.

Similar News

News November 18, 2025

ఓటమికి 100% బాధ్యత నాదే: ప్రశాంత్ కిశోర్

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోవడంపై జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ తొలిసారి స్పందించారు. ఓటమికి 100% తనదే బాధ్యత అని తెలిపారు. ‘మేం నిజాయితీగా ప్రయత్నించాం. కానీ విఫలమయ్యాం. మా ఆలోచనలను వివరించిన విధానంలో ఏదో పొరపాటు జరిగింది. దీన్ని ఒప్పుకోవడంలో నాకు మొహమాటం లేదు. మేం అధికారంలో మార్పు తీసుకురాలేకపోయినప్పటికీ రాష్ట్ర రాజకీయాలను మార్చడంలో కొంత పాత్ర పోషించాం’ అని చెప్పారు.

News November 18, 2025

ఓటమికి 100% బాధ్యత నాదే: ప్రశాంత్ కిశోర్

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోవడంపై జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ తొలిసారి స్పందించారు. ఓటమికి 100% తనదే బాధ్యత అని తెలిపారు. ‘మేం నిజాయితీగా ప్రయత్నించాం. కానీ విఫలమయ్యాం. మా ఆలోచనలను వివరించిన విధానంలో ఏదో పొరపాటు జరిగింది. దీన్ని ఒప్పుకోవడంలో నాకు మొహమాటం లేదు. మేం అధికారంలో మార్పు తీసుకురాలేకపోయినప్పటికీ రాష్ట్ర రాజకీయాలను మార్చడంలో కొంత పాత్ర పోషించాం’ అని చెప్పారు.

News November 18, 2025

కేరళ రూల్ మన దగ్గరా కావాలని డిమాండ్!

image

ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలొస్తున్నాయి. ఇక్కడి రెస్టారెంట్లలో వంట నూనెను మూడు సార్లు కంటే ఎక్కువ ఉపయోగిస్తే రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నారు. నూనెను ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల గుండె జబ్బులు వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లోని చాలా రెస్టారెంట్లలోనూ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని, అధికారులు కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. మీకామెంట్?