News February 8, 2025
17 మంది అభ్యర్థులు-23 సెట్ల నామినేషన్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738988566435_710-normal-WIFI.webp)
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నామినేషన్లు ఊబందుకున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 17 మంది అభ్యర్థులు 23 సెట్లు నామినేషన్లు వేశారు. ఈరోజు, రేపు సెలవు ఉండడంతో నామినేషన్కు 10న ఒక్క రోజే గడువు ఉంది.
Similar News
News February 8, 2025
ఢిల్లీని కమ్మేసి.. AAPను ఊడ్చేసిన కమలం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738994235747_81-normal-WIFI.webp)
ఢిల్లీ ఎన్నికల్లో BJP ఆధిక్యంలో దూసుకెళ్తోంది. 27 ఏళ్ల తర్వాత అక్కడ అధికారాన్ని చేపట్టడానికి వ్యూహాలు రచించింది. ఢిల్లీని ఆనుకొని ఉన్న హరియాణా, UP, రాజస్థాన్లో రూలింగ్లో ఉండటం, కేంద్రంలోనూ హ్యాట్రిక్ పాలన కొనసాగించడం కమలం పార్టీకి బాగా కలిసొచ్చింది. 2017 నుంచి UPలో, 2023 నుంచి రాజస్థాన్, హరియాణాలో గతేడాది కమలం 2వసారి మళ్లీ అధికారంలోకి రావడంతో కాషాయం శ్రేణులు హస్తిన ఓటర్లను ప్రభావితం చేయగలిగారు.
News February 8, 2025
కేరళ క్రికెట్ సంఘంపై శ్రీశాంత్ ఆగ్రహం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738999708296_1045-normal-WIFI.webp)
కేరళ క్రికెట్ అసోసియేషన్(KCA)కు, మాజీ బౌలర్ శ్రీశాంత్కు మధ్య వివాదం ముదురుతోంది. విజయ్ హజారే ట్రోఫీకి KCA సంజూని సెలక్ట్ చేయకపోవడం వల్లే అతడికి ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాన్స్ దక్కలేదని శ్రీశాంత్ ఇటీవల ఆరోపించారు. ఆ ఆరోపణల్ని తిప్పికొట్టిన కేసీఏ, ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా అండగా నిలిచామని గుర్తుచేసింది. దానిపై స్పందించిన శ్రీశాంత్, తన పరువు తీసిన వారు తగిన జవాబు చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.
News February 8, 2025
ఢిల్లీ కోటపై కాషాయ జెండా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738999452383_653-normal-WIFI.webp)
27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగిరింది. కేంద్రంలో మూడు పర్యాయాలుగా బీజేపీ అధికారం చేపడుతున్నా హస్తిన పీఠం దక్కకపోవడం ఆ పార్టీకి వెలితిగా ఉండేది. కానీ ఇవాళ ఆ కోరిక తీరింది. అద్భుతమైన రాజకీయ వ్యూహాలతో ఆప్ కంచుకోటను బద్దలుకొట్టిన కమలదళం దేశ రాజధానిలో పాగా వేసింది. ఆప్ అధినేత కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాను సైతం ఓడించి కోలుకోలేని దెబ్బకొట్టింది.