News March 13, 2025
17, 18న అంగన్వాడీల ధర్నాలు జయప్రదం చేయాలి: సీఐటీయూ

కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈనెల 17, 18 తేదీల్లో 48 గంటల పాటు కలెక్టరేట్ ముందు నిర్వహించి ధర్నాలు జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి కోరారు. సంగారెడ్డిలో ధర్నా కరపత్రాలను గురువారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అంగన్వాడీలు ధర్నాకు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
Similar News
News January 3, 2026
మాగాణి మినుములో కాండపు ఈగ – నివారణ

మాగాణి మినుముకు చీడ పీడల సమస్య ఎక్కువ. పంటకు నష్టం చేసే పురుగుల్లో కాండపు ఈగ ఒకటి. ఇది ఎక్కువగా తొలకరి పైరును ఆశించి, కాండంలో చేరి తినటం వల్ల మొక్క ఎండిపోతుంది. దీని నివారణకు థయామిథాక్సామ్ 70 W.S. 5గ్రాములు లేక ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్. 5mlను కేజీ విత్తనానికి కలిపి తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసుకోవాలి. పైరుపై దీని నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1గ్రా. లేక డైమిథోయేట్ 2ml కలిపి పిచికారీ చేయాలి.
News January 3, 2026
రాష్ట్రవ్యాప్తంగా ‘ఐ కేర్ క్లినిక్స్’: మంత్రి

TG: ప్రజలకు కంటి వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ‘ఐ కేర్ క్లినిక్స్’ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి రాజనర్సింహ శాసనమండలిలో ప్రకటించారు. ఈ క్లినిక్ల నిర్వహణలో సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ‘హబ్’గా వ్యవహరిస్తుందన్నారు. ‘గత 2ఏళ్లలో 6,12,973 మందికి శుక్లాల ఆపరేషన్లు చేయించాం. 33.65L మంది పాఠశాల విద్యార్థులకు స్క్రీనింగ్ నిర్వహించి, 76,176 మందికి అద్దాలు పంపిణీ చేశాం’ అని వివరించారు.
News January 3, 2026
చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు: సంగారెడ్డి ఎస్పీ

జిల్లాలో ఎవరైనా చైనా మాంజాను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పరితోష్ పంకజ్ హెచ్చరించారు. చైనా మాంజాను ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందని చెప్పారు. దీనివల్ల ద్విచక్ర వాహనాదారులు, పాదాచారులు, పక్షులు గాయపడుతున్నారని చెప్పారు తెలిపారు. పతంగుల దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. తనిఖీల్లో పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.


