News January 12, 2025
దేశంలో 17 HMPV కేసులు

భారత్లో ఇప్పటివరకూ నమోదైన <<15087157>>HMPV <<>> కేసుల సంఖ్య 17కు చేరింది. గుజరాత్లో 5, మహారాష్ట్ర 3, కర్ణాటక 2, తమిళనాడు 2, కోల్కతా 3, అస్సాం 1, పుదుచ్చేరిలో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. రేపటి నుంచి యూపీలో మహా కుంభమేళా జరగనున్న నేపథ్యంలో ఈ కేసులు పెరుగుతాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇది కొత్త వైరస్ కాదని, 2001లో తొలిసారి దీనిని గుర్తించినట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News November 26, 2025
సంగారెడ్డి: పంచాయతీ ఎన్నికలకు పూర్తి బందోబస్తు: ఎస్పీ

జిల్లాలో మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికలకు పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అంతర్ జిల్లా, రాష్ట్ర చెక్ పోస్టులను కట్టుదిట్టంగా నిర్వహించాలని చెప్పారు. ఎన్నికల ప్రభావితం చేసే అక్రమ రవాణా జరగడానికి వీలు లేదని పేర్కొన్నారు.
News November 26, 2025
iBOMMA రవి కేసులో ట్విస్ట్.. పైరసీ చేయకుండా..!

iBOMMA రవి నేరుగా సినిమాలు పైరసీ చేయలేదని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. టెలిగ్రామ్, మూవీరూల్జ్, తమిళ్ఎంవీ లాంటి పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసేవాడని తెలిపారు. క్వాలిటీ తక్కువగా ఉన్న ఆ సినిమాలను టెక్నాలజీ సాయంతో HD క్వాలిటీలోకి మార్చి ఐబొమ్మ, బప్పం సైట్లలో పోస్ట్ చేసేవాడని చెప్పారు. అయితే గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ రూ.20 కోట్ల వరకు సంపాదించినట్లు గుర్తించారు.
News November 26, 2025
Official: అహ్మదాబాద్లో కామన్ వెల్త్ గేమ్స్

2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య నగరంగా అహ్మదాబాద్ అధికారికంగా ఖరారైంది. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో నిర్వహించిన కామన్వెల్త్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీలో 74 దేశాల ప్రతినిధులు ఇండియా బిడ్కు ఆమోదం తెలిపారు. ఇందులో 15-17 క్రీడలు ఉండనున్నాయి. వచ్చే ఏడాది గ్లాస్గోలో జరిగే గేమ్స్లో మాత్రం 10 స్పోర్ట్స్ ఉండనున్నాయి. కాగా 2030లో జరగబోయేవి శతాబ్ది గేమ్స్ కావడం గమనార్హం.


