News March 19, 2025

17 మంది మృతి.. J&K ప్రభుత్వం కీలక ప్రకటన

image

జమ్మూకశ్మీర్‌లో 3 కుటుంబాల్లోని 17 మంది అనుమానాస్పదంగా <<15242949>>మృతి చెందడంపై<<>> అసెంబ్లీలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వారి శరీరాల్లో 6 రకాల విషపదార్థాలు(అల్యూమినియం, కాడ్మియం, ఆల్డికార్బ్ సల్ఫేట్, ఎసిటామిప్రిడ్, డైథైల్డిథియోకార్బమేట్, క్లోర్ఫెనాపైర్) ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైందని తెలిపింది. బాక్టీరియల్, వైరల్ సంబంధిత వ్యాధులుగా నిర్ధారణ కాలేదంది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది.

Similar News

News October 21, 2025

ఉద్యోగి ఆత్మహత్య.. వేధింపులపై ఫిర్యాదు చేయలేదు: ఓలా ప్రతినిధి

image

OLA ఉద్యోగి <<18058963>>ఆత్మహత్య<<>> చేసుకున్న ఘటనపై ఆ సంస్థ ప్రతినిధి స్పందించారు. అరవింద్ మూడున్నరేళ్లుగా తమ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారని, ఆ సమయంలో వేధింపుల గురించి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. అరవింద్ కుటుంబానికి తక్షణమే అండగా నిలిచేందుకు ఫైనల్ సెటిల్‌మెంట్ డబ్బులు బ్యాంకు అకౌంట్లో వేశామని స్పష్టతనిచ్చారు. CEO భవీశ్‌పై నమోదైన కేసును హైకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు.

News October 21, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 21, 2025

సుప్రీం ఆదేశాలు పట్టించుకోవట్లేదు: రాజ్‌దీప్

image

ఢిల్లీలో దీపావళి రోజున రాత్రి 8-10 గంటల మధ్య బాణసంచా కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే 11pm దాటినా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోకుండా టపాసులు కాలుస్తున్నారని ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్వీట్ చేశారు. SC ఆదేశాలను అమలు చేయడంలో వైఫల్యానికి ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. సుప్రీంకోర్టు కూడా వాస్తవాన్ని పరిశీలించాలని కోరారు.