News May 5, 2024

170 చలివేంద్రాలు ఏర్పాటు చేశాం: HMWSSB

image

వేసవి తాపంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు HYD జలమండలి సిద్ధమైంది. వివిధ అవసరాల కోసం బయటకి వచ్చే సామాన్య ప్రజలు, ప్రయాణికులు, పాదచారుల దాహార్తిని తీర్చేందుకు నగరంలో ప్రధాన ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైతు బజార్లు, మార్కెట్లు, ప్రధాన కూడళ్లు తదితర ప్రాంతాల్లో తాగునీరు సరఫరా చేస్తోంది. ఇందు కోసం GHMC పరిధిలో 170 చలివేంద్రాలు ఏర్పాటు చేశామని ఆదివారం తెలిపారు.

Similar News

News September 24, 2024

విద్యాశాఖకు మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ: RSP

image

రాష్ట్రంలో జరుగుతున్న అంశాలను BRS నేత RSP ‘X’ ద్వారా ప్రభుత్వం ముందు ఉంచారు. ‘ప్రభుత్వo DSC పరీక్షలు జూలై 18 నుంచి ఆగస్టు5 వరకు ఆన్‌లైన్(CBT)లో నిర్వహించింది. అభ్యర్థులు వాయిదా వేయాలని వేడుకున్నా పట్టించుకోకుండా హడావుడిగా ఎగ్జామ్ నిర్వహించింది. ఇంకా రిజల్ట్స్ విడుదలచేయలేదు. అసలు విద్యాశాఖ మంత్రి ఎవరు. ఆయన ఏ ప్రపంచంలో సేదతీరుతున్నారు. విద్యాశాఖకు మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ’ అని అన్నారు.

News September 24, 2024

HYD: కేంద్రమంత్రిని కలిసిన స్పీకర్, ఎంపీలు, ఎమ్మెల్యే

image

కేంద్రమంత్రి నితీన్‌గడ్కరీని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన పలు జాతీయ రహదారులపై గడ్కరీతో స్పీకర్ చర్చలు జరిపారు. స్పీకర్‌తో పాటు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తదితరులు ఉన్నారు.

News September 24, 2024

HYD: పదిమంది ఎమ్మెల్యేలకు నోటీసులు!

image

BRS పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన పదిమంది ఎమ్మెల్యేలకు సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ మార్పుపై 4 వారాల్లోగా వివరణతో కూడిన ఆపిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. పార్టీ ఫిరాయింపు చట్టం మేరకు వారిని డిస్‌క్వాలిఫై చేయాలని ఆయన కోరారు.