News May 3, 2024

నాలుగో దశ బరిలో 1,717 మంది

image

లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో మొత్తం 1,717 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 స్థానాల్లో మే 13న జరిగే పోలింగ్‌లో ఓటర్లు వీరి భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు. ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాలకు 454 మంది, తెలంగాణలోని 17 స్థానాలకు 525 మంది బరిలో ఉన్నట్లు ఈసీ వెల్లడించింది.

Similar News

News March 24, 2026

చర్చలు విఫలం.. వెనక్కి తగ్గని జీవన్ రెడ్డి

image

TG: రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌ చేసిన బుజ్జగింపులు విఫలమయ్యాయి. తాను ఏ డిమాండ్లను పీసీసీ ముందు పెట్టలేదని, తన సమస్యకు అధిష్ఠానం వద్ద పరిష్కారం లేదని తెలిపారు. పార్టీ మారొద్దని పీసీసీ చీఫ్ కోరారు కానీ ఎలాంటి హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల అనుబంధం వదులుకోవడం బాధగా ఉన్నా తప్పడం లేదన్నారు.

News March 24, 2026

రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం!

image

ఆల్ రౌండర్ రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఖరారైనట్లు సమాచారం. యూపీ ప్రభుత్వం ఆయన్ను రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది. భారత క్రికెట్ జట్టుకు ఆయన చేస్తున్న సేవలు, నిబద్ధతకు గుర్తింపుగా ఈ అవకాశం ఇవ్వనున్నట్లు ఇండియా టుడే వెల్లడించింది. కాగా ఈ పోస్టు యూపీలో గ్రూప్-A కిందికి వస్తుంది. జీతం, అలవెన్సులతో కలిపి రూ.56,100 నుంచి రూ.1,77,500 చేతికి అందుతుంది.

News March 24, 2026

ఈసీ లెటర్‌లో బీజేపీ ముద్ర.. విపక్షాల ఆగ్రహం

image

కేరళంలో ఎలక్షన్ కమిషన్‌ లెటర్‌లో <<19459684>>బీజేపీ సీల్<<>> ఉండటంపై కాంగ్రెస్, CPM తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ‘ఇది పొరపాటు కాదు. తీవ్రమైన ప్రమాద సంకేతం. రాజ్యంగబద్ధ సంస్థ క్రెడిబిలిటీ, న్యూట్రాలిటీపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఎన్నికల సంఘం బీజేపీ తొత్తులా ఎందుకు ప్రవర్తిస్తోంది? దీనికి జవాబుదారీ ఎవరు?’ అని కాంగ్రెస్ Xలో ప్రశ్నించింది. బీజేపీ, EC రెండూ ఒకే ముద్రను ఉపయోగిస్తున్నాయని CPM ఫైరయ్యింది.