News June 18, 2024
175 నాటౌట్: భారత క్రికెట్లో చిరస్మరణీయం!

సరిగ్గా 41 ఏళ్ల క్రితం.. జూన్ 18, 1983. జింబాబ్వేతో వరల్డ్ కప్ మ్యాచ్. భారత్ 9 రన్స్కే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆ దశలో బ్యాటింగ్కు వచ్చారు కపిల్ దేవ్. 138 బంతుల్లో 175 రన్స్(నాటౌట్)తో టీం ఇండియా స్కోరును 266 పరుగులకు చేర్చారు. ఛేజింగ్లో జింబాబ్వే 235 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో వారం తర్వాత తమ తొలి వన్డే ప్రపంచకప్ను గెలిచింది భారత జట్టు.
Similar News
News March 4, 2026
శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌకపై దాడి.. 100 మంది గల్లంతు!

శ్రీలంకలో ఇరాన్ యుద్ధ నౌకపై దాడి జరిగింది. సబ్మెరైన్తో అటాక్ చేయడంతో IRIS Dena షిప్లోని 101 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. మరో 78 మంది గాయపడ్డారని సమాచారం. షిప్ నుంచి సాయం కోసం కాల్ వచ్చిందని, నేవీ, ఎయిర్ ఫోర్స్ను పంపామని శ్రీలంక తెలిపింది. గాలే తీరంలో షిప్ మునిగిపోయిందని, తీవ్రంగా గాయపడిన 32 మందిని ఆస్పత్రిలో చేర్చినట్లు లంక మంత్రి విజిత హెరాత్ తెలిపారు. దాడి ఎవరు చేశారనేది తెలియాల్సి ఉంది.
News March 4, 2026
BRIC-THSTIలో ఉద్యోగాలు

<
News March 4, 2026
బిహార్ సీఎంగా బీజేపీ నేత?

బిహార్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. CM నితీశ్ను రాజ్యసభకు పంపే యోచనలో JDU ఉన్నట్లు సమాచారం. ఆయనకు BJP కేంద్ర క్యాబినెట్లో చోటు కల్పించనుందని తెలుస్తోంది. బిహార్ CMగా బీజేపీ నేతకు పగ్గాలు అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 89, జేడీయూ 85 సీట్లు గెలిచిన విషయం తెలిసిందే.


