News July 17, 2024

18న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

image

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను జులై 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జులై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జులై 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

Similar News

News December 30, 2025

పుంగనూరు: బైకును ఢీకొన్న RTC బస్సు.. ఒకరు స్పాట్ డెడ్

image

పుంగనూరు మండలం నూతన బైపాస్ మలుపు వద్ద పలమనేరు నుంచి పుంగనూరుకు వస్తున్న RTC బస్సు బైకును ఢీకొనడంతో గుడిసి బండకు చెందిన సోమశేఖర్(27) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి ఏఎస్ఐ అశ్వత్ నారాయణ, పోలీసు సిబ్బంది చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 30, 2025

చిత్తూరు జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్

image

రవి సీజన్లో పంటల సాగు జిల్లాలో యూరియా కొరతలేదని కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. పంటలకు అవసరమైన 2183 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. డీలర్లు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News December 30, 2025

చిత్తూరులో తగ్గిన నేరాల శాతం: SP

image

చిత్తూరు జిల్లాలో 2025 సంవత్సరంలో నేరాల శాతం తగ్గినట్టు ఎస్పీ తుషార్ తెలిపారు. పోలీసు శాఖ వార్షిక నివేదికను ఆయన తెలియజేశారు. గత సంవత్సరం 7034 కేసులు నమోదు కాగా, ఈసారి 5216 నమోదు అయ్యాయని, 26% తగ్గుదల కనిపించిందని చెప్పారు. రూ. 2 కోట్లు విలువచేసే 1021 మొబైల్ ఫోన్లను బాధితులకు అందించామన్నారు. సైబర్ బాధితులకు రూ. 68 లక్షలు రికవరీ చేసి అందజేశామన్నారు.