News July 10, 2024

18న సూర్యాపేట పోస్ట్ ఆఫీసులో ఇంటర్వ్యూలు

image

తపాలా శాఖలో కమిషన్ ప్రాతిపదికన పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 18న సూర్యాపేట పోస్ట్ ఆఫీస్‌లో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సూర్యాపేట డివిజన్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ జి.సైదులు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సూర్యాపేట డివిజన్‌లోని 347 పోస్ట్ ఆఫీసులు పరిధిలో 18 ఏళ్లు నిండి 10వ తరగతి ఉత్తీర్ణులైన వారిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 7, 2025

దామరచర్ల: పత్తి చేనులో పుర్రె, ఎముకలు

image

దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెం గ్రామానికి చెందిన ఓ రైతు వ్యవసాయ పొలంలో మనిషి పుర్రె, ఎముకలు కనిపించిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. పత్తి తెంపడానికి వచ్చిన కూలీలు పుర్రె, ఎముకలు చూసి పొలం యజమానికి తెలపడంతో యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News November 7, 2025

నల్గొండలో ర్యాగింగ్‌పై కలెక్టర్‌ ఆరా

image

నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగిందంటూ మీడియాలో వచ్చిన వార్తలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఆరా తీశారు. ఆమె అదనపు కలెక్టర్, ఆర్డీఓతో కలిసి కళాశాలను సందర్శించారు. విద్యార్థులు, ప్రిన్సిపల్‌తో విడివిడిగా మాట్లాడిన కలెక్టర్, తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు. అయితే, విద్యార్థులు స్నేహపూర్వక వాతావరణంలో ఉన్నట్లు చర్చల్లో తెలిసిందని ఆమె పేర్కొన్నారు.

News November 7, 2025

NLG: వేతన బకాయిల కోసం ఎదురుచూపులు

image

చాలీచాలని వేతనాలు.. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల కారణంగా పెట్టిన పెట్టుబడి రాక మధ్నాహ్న భోజన పథకం నిర్వాహకులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. వీటికి తోడుగా గత 6 నెలలుగా జిల్లా వ్యాప్తంగా వేతన బకాయిలు రాకపోవడంతో మధ్నాహ్న భోజన పథకం నిర్వాహకులకు నిర్వహణ మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిరాణ దుకాణాల నుంచి సరుకులు అరువు తెచ్చి భోజనం వండుతున్నామని తెలిపారు.