News February 15, 2025
18, 19వ తేదీల్లో కృష్ణా ఎక్స్ప్రెస్ రీ షెడ్యూల్

వరంగల్ మీదుగా నడిచే కృష్ణా ఎక్స్ప్రెస్ ట్రైన్ను నిర్ణీత సమయం కన్నా 90 నిమిషాల తేడాతో ఈ నెల 18, 19న రీ షెడ్యూల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ- కాజీపేట మధ్య ఇంటర్ లాకింగ్ సిస్టం వర్క్ బ్లాక్తో వరంగల్, కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. ఈ నెల 17 నుంచి 20 వరకు షాలిమార్, కోణార్క్ రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు.
Similar News
News February 27, 2026
ప్రధాని మోదీని కలిసిన విజయ్-రష్మిక

నూతన దంపతులు విజయ్ దేవరకొండ-రష్మిక ఇవాళ ప్రధాని మోదీని కలిశారు. హైదరాబాద్ తాజ్కృష్ణాలో మార్చి 4న జరిగే రిసెప్షన్కు హాజరుకావాలని ఆహ్వానించారు. ఆయనకు ప్రత్యేక శాలువాను అందజేశారు. ఈ సందర్భంగా వీరికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వారితో కాసేపు కూర్చొని ముచ్చటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా విరోష్ జంట కలిసి రిసెప్షన్కు ఆహ్వానించింది. ఈ ఫొటోలు SMలో వైరలవుతున్నాయి.
News February 27, 2026
విపక్షాలే టార్గెట్గా సీబీ‘ఐ’.. ఆరోపణలకు బలం చేకూరిందా?

విపక్షాలను టార్గెట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం CBI, EDలను వాడుకుంటోందనేది ఎంతో మంది ఆరోపణ. అక్రమ కేసుల్లో ఇరికించి నాయకుల క్రెడిబిలిటీని నాశనం చేయడం, జైలుకు పంపడమే లక్ష్యమన్న విమర్శలున్నాయి. ఈ వాదనలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై తీర్పుతో బలం చేకూరిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆధారాల్లేకుండానే కేసు నమోదు చేసినందుకు CBI అధికారులపైనే విచారణ చేయాలని కోర్టు చెప్పడమే నిదర్శనమంటున్నారు.
News February 27, 2026
SRD: ఎలుకల మందు తాగి పారిపోయాడు!

క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న అనిల్ (28) అనే ఆటో డ్రైవర్ పటాన్చెరు జేపీ కాలనీలోని తన నివాసంలో ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బెట్టింగ్ నష్టంతో మద్యం తాగి భార్యతో గొడవపడిన అతను, మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. పోలీసులు వచ్చేలోపే పారిపోయిన అనిల్ను, అరగంట తర్వాత అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు.


