News February 15, 2025
18, 19వ తేదీల్లో కృష్ణా ఎక్స్ప్రెస్ రీ షెడ్యూల్

వరంగల్ మీదుగా నడిచే కృష్ణా ఎక్స్ప్రెస్ ట్రైన్ను నిర్ణీత సమయం కన్నా 90 నిమిషాల తేడాతో ఈ నెల 18, 19న రీ షెడ్యూల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ- కాజీపేట మధ్య ఇంటర్ లాకింగ్ సిస్టం వర్క్ బ్లాక్తో వరంగల్, కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. ఈ నెల 17 నుంచి 20 వరకు షాలిమార్, కోణార్క్ రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు.
Similar News
News October 22, 2025
TATA RECORD: 30 రోజుల్లో లక్ష కార్ల డెలివరీ

ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ రికార్డు సృష్టించింది. నవరాత్రి నుంచి దీపావళి వరకు 30 రోజుల్లో లక్షకు పైగా కార్లను డెలివరీ చేసినట్లు ప్రకటించింది. గతేడాది ఇదే పీరియడ్తో పోలిస్తే 33% వృద్ధి సాధించినట్లు వెల్లడించింది. అత్యధికంగా నెక్సాన్ 38వేలు, పంచ్ 32వేల యూనిట్లను విక్రయించామని తెలిపింది. అలాగే 10వేలకు పైగా EVలను అమ్మినట్లు పేర్కొంది. జీఎస్టీ 2.0, పండుగలు కలిసొచ్చినట్లు వివరించింది.
News October 22, 2025
జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్కు ఓటేయండి: సీతక్క

జూబ్లీహిల్స్ పరిధి బోరబండలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున మంత్రి సీతక్క ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని ఓటర్లకు సూచించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు అవకాశం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని చెప్పారు. కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు ఉన్నారు.
News October 22, 2025
జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్కు ఓటేయండి: సీతక్క

జూబ్లీహిల్స్ పరిధి బోరబండలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున మంత్రి సీతక్క ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని ఓటర్లకు సూచించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు అవకాశం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని చెప్పారు. కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు ఉన్నారు.