News February 15, 2025

18, 19వ తేదీల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్

image

వరంగల్ మీదుగా నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను నిర్ణీత సమయం కన్నా 90 నిమిషాల తేడాతో ఈ నెల 18, 19న రీ షెడ్యూల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ- కాజీపేట మధ్య ఇంటర్ లాకింగ్ సిస్టం వర్క్ బ్లాక్‌తో వరంగల్, కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. ఈ నెల 17 నుంచి 20 వరకు షాలిమార్, కోణార్క్ రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు.

Similar News

News November 5, 2025

సిరిసిల్ల: ‘CCI కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలి’

image

CCI కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి పత్తికి మద్దతు ధర పొందాలని సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ సూచించారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో పత్తి కొనుగోళ్లపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేములవాడ పరిధిలో రెండు, కోనరావుపేటలో ఒకటి, ఇల్లంతకుంట మండలంలో రెండు, మొత్తం 5 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

News November 5, 2025

ఈ సరసమైన రీఛార్జ్ ప్యాక్స్ అవసరం.. AIRTEL, JIOలకు విజ్ఞప్తులు!

image

అతితక్కువ మొబైల్ డేటాను వాడే సీనియర్ సిటిజన్లు, WiFi యూజర్లను దృష్టిలో ఉంచుకుని రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టాలని AIRTEL, JIOలకు నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ‘ప్రతి నెలా ₹100 కంటే తక్కువ ధరకు వాయిస్ ఓన్లీ ప్లాన్‌లను అందించండి. అవసరం లేకపోయినా, ప్రజలు డేటాను తీసుకోవలసి వస్తుంది. డైలీ 1GB & వాయిస్ కాల్స్ ఇచ్చే నెల, వార్షిక ప్లాన్స్ ఇవ్వండి. BSNLలో సరసమైన ప్లాన్స్ ఉన్నాయి’ అని సూచిస్తున్నారు.

News November 5, 2025

భద్రకాళి ఆలయ ప్రాంగణంలో ‘కొబ్బరి నీళ్లు అమ్మబడవు’

image

వరంగల్ భద్రకాళి ఆలయ ప్రాంగణంలో ‘కొబ్బరి నీళ్లు అమ్మబడవు’ అని సూచిస్తూ అధికారులు బుధవారం ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కొబ్బరి నీళ్లు విక్రయించడంపై విశ్వహిందూ పరిషత్ (VHP) ఫిర్యాదు చేయడంతో ఈవో సునీత స్పందించారు. ఈవో విచారణలో కొబ్బరిముక్కలు పోగు చేసుకునే టెండర్ పొందిన వ్యక్తి అనధికారికంగా కొబ్బరి నీళ్లు విక్రయిస్తున్నట్లు తేలింది. అతనికి రూ.15 వేల జరిమానా విధించారు.