News February 15, 2025

18, 19వ తేదీల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్

image

వరంగల్ మీదుగా నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను నిర్ణీత సమయం కన్నా 90 నిమిషాల తేడాతో ఈ నెల 18, 19న రీ షెడ్యూల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ- కాజీపేట మధ్య ఇంటర్ లాకింగ్ సిస్టం వర్క్ బ్లాక్‌తో వరంగల్, కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. ఈ నెల 17 నుంచి 20 వరకు షాలిమార్, కోణార్క్ రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు.

Similar News

News November 12, 2025

భారీ ఉగ్రకుట్ర.. భగ్నం చేసింది తెలుగోడే

image

జైషే మొహ్మద్ భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నం చేసింది తెలుగు ఆఫీసర్ సందీప్ చక్రవర్తి. కర్నూలుకు చెందిన సందీప్ 2014 IPS ఆఫీసర్. చాలాకాలంగా కశ్మీర్‌లో యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో సమర్థంగా విధులు నిర్వర్తించి ఆరుసార్లు ప్రెసిడెంట్ మెడల్ పొందారు. గత నెలలో పలుచోట్ల జైషే పోస్టర్లు చూసి, CC కెమెరాల్లో పాత కేసు నిందితులు ముగ్గురిని గుర్తించి 2 వారాలు విచారించారు. దీంతో డాక్టర్ల భారీ టెర్రర్ ప్లాన్ బయటపడింది.

News November 12, 2025

HYD: సత్యసాయి భక్తులకు గుడ్ న్యూస్

image

సత్యసాయిబాబా భక్తులకు ఆర్టీసీ అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. ఈనెల 23న పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ వేడుకలకు వెళ్లే గ్రేటర్ HYD వాసులకు సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నామన్నారు. ఈనెల 22న సాయంత్రం బస్సు బయలుదేరుతుంది. వేడుకలు ముగిసిన అనంతరం 23న సాయంత్రం పుట్టపర్తి నుంచి సిటీకి బయలుదేరుతుందని డిపో-1 మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. 73828 24784 నంబరుకు ఫోన్ చేయాలన్నారు.

News November 12, 2025

HYD: సత్యసాయి భక్తులకు గుడ్ న్యూస్

image

సత్యసాయిబాబా భక్తులకు ఆర్టీసీ అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. ఈనెల 23న పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ వేడుకలకు వెళ్లే గ్రేటర్ HYD వాసులకు సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నామన్నారు. ఈనెల 22న సాయంత్రం బస్సు బయలుదేరుతుంది. వేడుకలు ముగిసిన అనంతరం 23న సాయంత్రం పుట్టపర్తి నుంచి సిటీకి బయలుదేరుతుందని డిపో-1 మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. 73828 24784 నంబరుకు ఫోన్ చేయాలన్నారు.