News February 15, 2025

18, 19వ తేదీల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్

image

వరంగల్ మీదుగా నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను నిర్ణీత సమయం కన్నా 90 నిమిషాల తేడాతో ఈ నెల 18, 19న రీ షెడ్యూల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ- కాజీపేట మధ్య ఇంటర్ లాకింగ్ సిస్టం వర్క్ బ్లాక్‌తో వరంగల్, కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. ఈ నెల 17 నుంచి 20 వరకు షాలిమార్, కోణార్క్ రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు.

Similar News

News November 5, 2025

PDPL: నవంబర్ 20 వరకు పూర్తి చేయాలి: కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం భవిత సెంటర్ నిర్వహణపై సమీక్ష చేశారు. దివ్యాంగ విద్యార్థులకు మరింత సమర్థవంతమైన బోధన కోసం మరమ్మతులు, విద్యుత్, పేయింటింగ్, వసతుల పనులు నవంబర్ 20 నాటికి పూర్తి చేయాలని ఆయన సూచించారు. ప్రతి కేంద్రంలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా, హాజరు, కార్యకలాపాలను ప్రతిరోజు నమోదు చేయాలని పేర్కొన్నారు. ప్రతి సెంటర్‌కు 5- 10 లక్షల ఖర్చు అవుతుందని, వినూత్న పద్ధతిలో బోధన ఉండాలన్నారు.

News November 5, 2025

ఖమ్మంలోని గవర్నమెంట్ బ్యాంక్‌లో JOBS

image

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్‌(TGCAB)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ గడువు రేపటితో ముగుస్తుంది. ఖమ్మంలో 99 స్టాఫ్ అసిస్టెంట్‌‌లు అవసరముంది. అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 30 మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు ‘https://tgcab.bank.in/’లో చెక్ చేసుకోండి. SHARE IT

News November 5, 2025

SRSP UPDATE: 4 గేట్లే ఓపెన్

image

ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం తగ్గడంతో SRSP గేట్లను మూసివేస్తున్నారు. బుధవారం ఉదయం 4 గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఎగువ నుంచి 21,954 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా ఔట్ ఫ్లోగా అంతే నీటిని దిగువకు వదులుతున్నారు.