News February 15, 2025
18, 19వ తేదీల్లో కృష్ణా ఎక్స్ప్రెస్ రీ షెడ్యూల్

వరంగల్ మీదుగా నడిచే కృష్ణా ఎక్స్ప్రెస్ ట్రైన్ను నిర్ణీత సమయం కన్నా 90 నిమిషాల తేడాతో ఈ నెల 18, 19న రీ షెడ్యూల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ- కాజీపేట మధ్య ఇంటర్ లాకింగ్ సిస్టం వర్క్ బ్లాక్తో వరంగల్, కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. ఈ నెల 17 నుంచి 20 వరకు షాలిమార్, కోణార్క్ రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు.
Similar News
News November 5, 2025
ప్రకాశం: ఇళ్లు కట్టుకునేవారికి శుభవార్త

రాష్ట్రంలో ఇల్లులేని పేదలకు కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా గృహాలను మంజూరు చేయనుంది. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులను గుర్తించేందుకు ఇప్పటికే జిల్లాలో సర్వే ప్రారంభించారు. తాజాగా సర్వే <<18185186>>గడువును నవంబర్ 30 వరకు<<>> పొడిగించినట్లు ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. గృహాల మంజూరు కోసం జాబ్ కార్డు, రేషన్, ఆధార్ కార్డులతో పాటు స్థానిక అధికారులను సంప్రదించాలన్నారు.
News November 5, 2025
రాష్ట్ర భవిష్యత్తుకే తలమానికం: మంత్రి డోలా

విశాఖ వేదికగా జరగనున్న భాగస్వామ్య సదస్సు రాష్ట్ర భవిష్యత్తుకు తలమానికం కానుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొనారు. AU ఇంజినీరింగ్ గ్రౌండ్లో ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. 40 పైచిలుకు దేశాల నుంచి వందల సంఖ్యలో వివిధ కంపెనీల ప్రతినిధులు వస్తున్నారని తెలిపారు. దీంతో రాష్ట్రానికి రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగావకాలు వస్తాయన్నారు.
News November 5, 2025
జగిత్యాల: కిటకిటలాడుతున్న ఆలయాలు

జగిత్యాల జిల్లా కేంద్రంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచి భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉసిరిక చెట్టు వద్ద దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు భక్తులు అర్చకులకు కార్తీక పౌర్ణమి సందర్భంగా దీప దానాలు చేశారు.


