News November 24, 2024
అర్ష్దీప్ సింగ్కు రూ.18 కోట్లు

భారత స్టార్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ను పంజాబ్ తిరిగి సొంతం చేసుకుంది. బేస్ ప్రైస్ రూ.2 కోట్లు ఉండగా రూ.18 కోట్లకు RTM పద్ధతిలో పంజాబ్ కొనుగోలు చేసింది. ఇతడి కోసం గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, SRH పోటీ పడ్డాయి. గతంలో ఇతడు పంజాబ్ కింగ్స్ తరఫునే ఆడారు. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టడం సింగ్ స్పెషాలిటీ.
Similar News
News December 20, 2025
రేపు తెలంగాణ భవన్కు కేసీఆర్

TG: చాలారోజుల తర్వాత గులాబీ బాస్ KCR పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్కు వెళ్లనున్నారు. రేపు మ.2 గంటలకు ఆయన ఆధ్వర్యంలో BRS LP, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ జరగనుంది. ‘ఏపీ జల దోపిడీ-కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం’ అనే అంశంపై మాట్లాడనున్నారు. సాగునీటి హక్కుల రక్షణ కోసం ‘మరో ప్రజా ఉద్యమం’పై KCR దిశానిర్దేశం చేస్తారని BRS వర్గాలు తెలిపాయి. పార్టీ సంస్థాగత నిర్మాణంపైనా ఆయన సూచనలు చేస్తారని చెప్పాయి.
News December 20, 2025
క్లీనింగ్ టిప్స్

* నిమ్మకాయను మిక్సీలో వేసి మెత్తగా చేసుకొని దానిలో కాస్త వంట సోడాను కలిపి సింక్ కొళాయిలకు రాసి అరగంట తరువాత కడిగితే మురికి వదిలిపోతుంది.
* కప్పుల్లో కాఫీ, టీ మరకలు వదలకపోతే వెనిగర్ లో ఉప్పు కలిపి రుద్దితే త్వరగా వదిలిపోతాయి.
* స్టెయిన్ లెస్ స్టీల్ సింక్ మీద నీళ్ళ మరకలు పోవాలంటే వంటసోడాలో వెనిగర్ కలిపి రుద్దాలి. గంట తర్వాత చల్లటి నీళ్ళతో కడిగితే కొత్తదానిలా మెరిసిపోతుంది.
News December 20, 2025
భారీగా పెరిగిన వెండి ధర!

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి ధరలు భారీగా పెరగ్గా గోల్డ్ రేట్స్ తటస్థంగా ఉన్నాయి. కేజీ సిల్వర్పై ఏకంగా రూ.5,000 పెరిగి జీవితకాల గరిష్ఠానికి చేరింది. ప్రస్తుతం KG వెండి రేటు రూ.2,26,000గా ఉంది. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,34,180, 22క్యారెట్ల 10gmల గోల్డ్ రేటు రూ.1,23,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


