News October 6, 2024

18 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్

image

TG: HYD సైబర్ క్రైమ్ పోలీసులు పలు రాష్ట్రాల్లో ఆపరేషన్ నిర్వహించి 18 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. రూ.5 లక్షల నగదు, 26 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరి బ్యాంక్ ఖాతాల్లోని రూ.1.61 కోట్లను సీజ్ చేశారు. తెలంగాణలో రూ.6.94 కోట్లు దోచేసిన ఈ నిందితులపై దేశవ్యాప్తంగా 400కిపైగా కేసులున్నాయి. సీబీఐ, ఈడీ కేసులు, డ్రగ్స్, కొరియర్, పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసగించి, బెదిరించి డబ్బులు వసూలు చేశారు

Similar News

News January 11, 2026

గండికోటకు వెళ్లాలంటే మార్గాలు ఇవే..!

image

గండికోటలో 11 నుంచి 13వ తేదీ వరకు ‘గండికోట ఉత్సవాలు’ జరుగుతున్నాయి. ఇక్కడికి చేరుకోవడానికి పలు మార్గాలు ఉన్నాయి.
➤ రోడ్డు మార్గం: జమ్మలమడుగు నుంచి రోడ్డు మార్గం ఉంది (17 KM)
➤ రైలు మార్గం: జమ్మలమడుగు స్టేషన్ నుంచి 18 KM, ముద్దనూరు స్టేషన్ నుంచి 25KM ఉంటుంది. స్టేషన్ల నుంచి రోడ్డు మార్గాన చేరుకోవచ్చు.
➤ విమాన మార్గం: కడపలో విమానాశ్రయం ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గాన గండికోటకు చేరుకోవచ్చు.

News January 11, 2026

సంక్రాంతి సందడి.. హోటళ్లు హౌస్‌ఫుల్

image

AP: గోదావరి జిల్లాల్లో సందడి సంక్రాంతి మొదలైంది. భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, కాకినాడ, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో హోటళ్లు, లాడ్జిలు హౌస్‌ఫుల్ అయిపోయాయి. కోడిపందేల కోసం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి జనం తరలివస్తున్నారు. పందేల బరులు భారీగా ఏర్పాటు చేస్తున్నారు. హోటల్ యజమానులు గదుల అద్దెను మూడు రోజులకు రూ.30-60 వేలు వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

News January 11, 2026

తలనొప్పితో బాధపడుతున్నారా?

image

తరచూ తలనొప్పి వస్తుంటే దానికి ప్రధాన కారణం మన రోజువారీ అలవాట్లేేనని నిపుణులు అంటున్నారు. మార్నింగ్ టిఫిన్ దాటవేయడం, ఎక్కువసేపు ఆకలితో ఉండటం దీనికి ముఖ్య కారణాలు. అలాగే ఒత్తిడితో కూడిన జీవనశైలి వలన మెడ, తల కండరాలు బిగుసుకుపోయి నొప్పి వస్తుంది. తగినంత నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడి అకస్మాత్తుగా తలనొప్పి వస్తుంది. బరువు తగ్గాలనే ఉద్దేశంతో సరిగ్గా తినకపోయినా, నిద్ర లేకపోయినా ఈ సమస్య వస్తుంది.