News December 24, 2024

జాబ్ అప్లికేషన్‌కు 18% GST.. కేంద్రంపై ప్రియాంకా గాంధీ ఫైర్

image

అగ్నివీర్‌తో సహా ప్రతి ఉద్యోగ నియామక పరీక్షల దరఖాస్తులపై కేంద్రం 18% జీఎస్టీ విధిస్తోందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు. యూపీలోని ఓ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాల దరఖాస్తుకు ఫీజు ₹1000 ఉంటే దానిపై జీఎస్టీ ₹180 అని పేర్కొన్నారు. పిల్లల్ని చదివించడం కోసం పేరెంట్స్ రూపాయి రూపాయి కూడబెడితే, ప్రభుత్వం వారి కలల్ని ఇలా ఆదాయ వనరుగా మార్చుకుంటోందని మండిపడ్డారు.

Similar News

News October 29, 2025

టీమ్‌గా పనిచేసి నష్టనివారణ చర్యలు చేపట్టాం: CM చంద్రబాబు

image

AP: సమర్థంగా వ్యవహరించి తుఫాన్ నష్టనివారణ చర్యలు చేపట్టామని కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో టెలీకాన్ఫరెన్స్‌లో CM చంద్రబాబు అన్నారు. ‘అంతా టీమ్‌గా పనిచేశాం. ప్రతిఒక్కరికీ అభినందనలు. మరో 2 రోజులు ఇలానే చేస్తే మరింత ఊరట ఇవ్వగలం. మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలి. ప్రభుత్వం ఏం చేసిందో చెబుతూ సమస్యలు అడిగి తెలుసుకోవాలి. నష్టం అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇవ్వాలి’ అని ఆదేశించారు.

News October 29, 2025

TTD దేవాలయాలన్నిటిలో అన్నదానం

image

AP: ట్రస్టు డిపాజిట్లు ₹2500 కోట్లకు చేరనుండడంతో దేశంలోని తమ అన్ని దేవాలయాల్లోనూ ‘అన్నదానం’ చేయాలని TTD నిర్ణయించింది. కరీంనగర్(TG)లో ఆలయ నిర్మాణానికి ₹30 కోట్లు కేటాయించింది. అక్కడే ₹3 కోట్లతో ‘ఆధ్యాత్మిక ఉద్యానవనం’ నిర్మించనుంది. తక్కువ ధరలకు మందులు విక్రయించేలా స్విమ్స్ ఆధ్వర్యంలో మెడికల్ షాపులను ఏర్పాటు చేయనుంది. వైకుంఠ ద్వార దర్శన విధానాన్ని 10 రోజుల పాటు కొనసాగించనుంది.

News October 29, 2025

కాసేపట్లో మ్యాచ్.. రికార్డుల్లో మనదే పైచేయి!

image

ఈరోజు మధ్యాహ్నం 1.45 గంటలకు ఆస్ట్రేలియాVsభారత్ తొలి T20 ప్రారంభం కానుంది. అయితే ఆసీస్‌పై పొట్టి క్రికెట్లో మనదే పైచేయి. కంగారూ గడ్డపై ఇప్పటి వరకు ఇండియా టీ20 సిరీస్ కోల్పోలేదు. 2012లో 1-1తో సమం కాగా 2016లో 3-0 తేడాతో గెలిచింది. 2018లో మళ్లీ 1-1తో సమం చేయగా 2020లో 2-1తో సిరీస్ సాధించింది. ఇక AUS-IND మధ్య జరిగిన చివరి 8 మ్యాచుల్లో భారత్ ఏడింట్లో గెలవడం విశేషం.