News April 1, 2025

శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. మరోవైపు వేంకటేశ్వరుడి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 73,007 మంది భక్తులు దర్శించుకోగా.. 27,440 మంది తలనీలాలు సమర్పించారు. స్వామి హుండీ ఆదాయం రూ.3.04కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Similar News

News December 27, 2025

డ్రగ్స్ కేసు.. పరారీలో హీరోయిన్ సోదరుడు!

image

డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లో ఈగల్ టీమ్ చేసిన దాడుల్లో భారీగా కొకైన్, MDMA సీజ్ చేశారు. నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ అనే పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి రెగ్యులర్ కస్టమర్ల లిస్టులో అమన్ ప్రీత్ సింగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న అమన్ పరారైనట్లు సమాచారం.

News December 27, 2025

ఇక తక్కువ అద్దెకే రైతుకు సాగు పరికరాలు

image

AP: ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాతలకు తక్కువ ఖర్చుతో సాగుకు అవసరమయ్యే పరికరాలను అద్దెకు ఇచ్చేందుకు CHC(కస్టమ్ హైరింగ్ సెంటర్)లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతగా 300 CHCల ఏర్పాటుకు నిర్ణయించింది. ఇక్కడ ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, డ్రోన్లు, మినీ ట్రక్కులు, భూసార పరీక్షలు చేసే కిట్స్, మినీ రైస్ మిల్లు, ఇతర పరికరాలను తక్కువ అద్దెకు రైతులకు అందిస్తారు.

News December 27, 2025

PCOS ఉన్నా పిల్లలు పుట్టాలంటే?

image

ప్రస్తుతకాలంలో చాలామంది PCOS వల్ల సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నవారు బరువు తగ్గడం, ఇన్సులిన్ అదుపులో ఉంచుకోవడం, డీ విటమిన్ లోపం రాకుండా చూసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు పాటిస్తూ వైద్యులను కలిసి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు. యోగా, ధ్యానం చేయడం, ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలంటున్నారు.