News November 9, 2024
‘పది’ పరీక్ష ఫీజు చెల్లింపునకు 18 లాస్ట్ డేట్

TG: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈనెల 18 తుది గడువు అని పరీక్షల విభాగం కన్వీనర్ ఎ.కృష్ణారావు తెలిపారు. రూ.50-రూ.500 వరకు ఆలస్య రుసుముతో DEC 21 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఎగ్జామ్ ఫీజును రూ.125గా నిర్ణయించినట్లు చెప్పారు. SC, ST, BC విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం పట్టణాల్లో రూ.24వేలు, గ్రామాల్లో రూ.20వేల లోపు ఉండి, ఆదాయ ధ్రువపత్రాలు సమర్పిస్తే ఫీజు మినహాయింపు ఉంటుందని తెలిపారు.
Similar News
News November 10, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

* ఏలూరు(D) జంగారెడ్డిగూడెంలో దివంగత సింగర్ ఎస్పీ బాలు విగ్రహాన్ని ఆయన కుమారుడు చరణ్ ఆవిష్కరించారు.
* PPP విధానంలో ప్రజలపై భారం పడకుండా పలు కీలక రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి రూ.2,800 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
* పట్టణాల్లోని వ్యాపార భవనాల్లో ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్(ECBC) అమలులో దేశంలోనే AP అగ్రస్థానంలో నిలిచింది.
News November 10, 2025
నేటి నుంచి ‘స్వామిత్వ’ గ్రామసభలు

APలో <<18165882>>స్వామిత్వ<<>>(SVAMITVA) కార్యక్రమం ఊపందుకుంది. 45 లక్షల ఆస్తులకు ప్రాపర్టీ కార్డుల జారీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గ్రామ కంఠాల్లో ఇళ్లు, స్థలాలకు అర్హులైన యజమానులకు ప్రాపర్టీ కార్డుల జారీకి ముందు అభ్యంతరాలకు స్వీకరణ చేయనుంది. ఇందుకోసం నేటి నుంచి ఈ నెల 22 వరకు గ్రామ సభలు నిర్వహించనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, సర్వే శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి.
News November 10, 2025
మెడికల్ కాలేజీల్లో ఫీజులు పెంచిన ప్రభుత్వం

AP: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో పీజీ, యూజీ కోర్సుల ఫీజులను ప్రభుత్వం పెంచింది. 2020-23 బ్లాక్ పీరియడ్లో ఉన్న ఫీజుపై యూజీ కోర్సులకు 10%, సూపర్ స్పెషాలిటీ, పీజీ కోర్సులకు 15% పెంపునకు ఆమోదం తెలిపింది. హైకోర్టు, సుప్రీంకోర్టు తుదితీర్పులకు లోబడి ఇది ఉంటుందని వెల్లడించింది. రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సులకు రూ.17.25 లక్షలుగా ఫీజును నిర్ధారించింది.


