News August 22, 2024
18 మంది మృతి.. ప్రమాదం జరిగిందిలా

AP: అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో పేలుడుకు 18 మంది చనిపోయారు. ఈ ప్రమాదానికి కారణాలపై ఫ్యాక్టరీస్ విభాగం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ‘రియాక్టర్లో తయారైన మిథైల్ టెర్ట్-బ్యుటైల్ ఈథర్ మిశ్రమాన్ని ట్యాంకులోకి మార్చుతుండగా లీకై ఆవిరిగా మారింది. ఆ వాయువు వాతావరణంలోని రసాయనాలతో ప్రతిస్పందించడంతో పేలుడు జరిగింది. ఆ లీకేజీ మిశ్రమం ఎలక్ట్రిక్ ప్యానల్పై పడటంతో మంటలు చెలరేగాయి’ అని పేర్కొంది.
Similar News
News January 22, 2026
హత్యారాజకీయాలతో విషబీజాలు నాటుతున్న CBN: జగన్

AP: హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ CBN నాటుతున్న విషబీజాలు చెట్లుగా మారి కంట్రోల్ కాని పరిస్థితులు వస్తాయని జగన్ హెచ్చరించారు. ‘ఇళ్లు, ఆస్తులు వదిలి ఊళ్లు వదిలి వెళ్లిపోయేలా YCP వారిపై కూటమి నేతలు దౌర్జన్యాలు చేస్తున్నారు. మా కార్యకర్తలను చంపేస్తున్నారు. బాధిత కుటుంబాలు రేపు చూస్తూ ఊరుకుంటాయా? పోలీసులు, MLAలు, CBN బాధ్యత వహించకతప్పదు’ అని పేర్కొన్నారు. పాలకులన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
News January 22, 2026
ప్రపంచంలోనే రద్దీ నగరాలు.. 2వ స్థానంలో బెంగళూరు

ప్రపంచంలోనే రద్దీగా ఉండే నగరాల జాబితాలో బెంగళూరు 2వ ప్లేస్లో నిలిచింది. డచ్ లొకేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్ టామ్టామ్ 2025 ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం బెంగళూరులో సగటు ప్రయాణ వేగం 16.6KM/hr. రద్దీ స్థాయి 74.4%. 2024తో పోలిస్తే ట్రాఫిక్ 1.7% పెరిగింది. ట్రాఫిక్ లేట్తో బెంగళూరు వాసులు ఏడాదిలో 168గంటలు కోల్పోయారు. పుణే 71.1% రద్దీతో 5వ, ముంబై 65.2%తో 18వ స్థానంలో ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్లో మెక్సికో ఉంది.
News January 22, 2026
వైట్ హెడ్స్ ఇలా తొలగిద్దాం..

చర్మంపై చాలా చిన్నగా తెల్లని మచ్చల్లా ఉండే వైట్ హెడ్స్ సమస్యను తగ్గించుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి. * రెండు చెంచాల ఓట్స్ పొడిలో నీళ్లు కలిపి మెత్తని ముద్దలా చేసి సమస్య ఉన్న చోట రాయాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగెయ్యాలి. * చెంచా వంటసోడాలో కాసిని నీళ్లు కలిపి వైట్ హెడ్స్ ఉన్న చోట రాయాలి. ఆ వంట సోడా పూత ఆరిపోయాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తోంటే అధిక జిడ్డు పోవడమే కాదు, వైటెడ్స్ సమస్య కూడా తగ్గుతుంది.


