News August 22, 2024

18 మంది మృతి.. ప్రమాదం జరిగిందిలా

image

AP: అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో పేలుడుకు 18 మంది చనిపోయారు. ఈ ప్రమాదానికి కారణాలపై ఫ్యాక్టరీస్ విభాగం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ‘రియాక్టర్‌లో తయారైన మిథైల్ టెర్ట్-బ్యుటైల్ ఈథర్ మిశ్రమాన్ని ట్యాంకులోకి మార్చుతుండగా లీకై ఆవిరిగా మారింది. ఆ వాయువు వాతావరణంలోని రసాయనాలతో ప్రతిస్పందించడంతో పేలుడు జరిగింది. ఆ లీకేజీ మిశ్రమం ఎలక్ట్రిక్ ప్యానల్‌పై పడటంతో మంటలు చెలరేగాయి’ అని పేర్కొంది.

Similar News

News November 28, 2025

NZB: 30న జిల్లా స్థాయి సీనియర్ కబడ్డీ జట్ల ఎంపికలు

image

నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 30న జిల్లా స్థాయి సీనియర్ మహిళా, పురుషుల జిల్లా జట్ల ఎంపికల ప్రక్రియ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ రెడ్డి తెలిపారు. ఈ ఎంపికలు ముప్కాల్‌లోని భూదేవి ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఇందులో పాల్గొనే పురుషుల వ్యక్తిగత శరీర బరువు 85 kgలు, మహిళల వ్యక్తిగత శరీర బరువు 75 kgల లోపు ఉండాలన్నారు.

News November 28, 2025

‘పిచ్చుకల పరిరక్షణలో విద్యార్థులను భాగస్వాములు చేయాలి’

image

కాకినాడ జిల్లాలోని ప్రతి విద్యార్థికి స్వయంగా ధాన్యం కుంచె తయారీ నేర్పించి, పిచ్చుకల పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములను చేయాలని తునికి చెందిన విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు పి. దాలినాయుడు కోరారు. గురువారం ఆయన కాకినాడ కలెక్టరేట్‌లో కలెక్టర్ షాన్‌మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. పిచ్చుకల పరిరక్షణకు తాను చేపట్టిన కార్యక్రమం వివరాలను ఆయన కలెక్టర్‌కు వివరించారు.

News November 28, 2025

టుడే టాప్ స్టోరీస్

image

*రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత: CM CBN
*దిత్వా తుఫానుతో రానున్న మూడ్రోజులు కోస్తా, సీమలో భారీ వర్షాలు
*TGలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
*TG: 2015 గ్రూప్-2 ర్యాంకర్ల నియామకాలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన HC డివిజన్ బెంచ్
*ఆధార్‌తో ఓటు హక్కు, పౌరసత్వం కుదరదు: సుప్రీంకోర్టు
*వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు మహిళల ప్రీమియర్ లీగ్