News August 22, 2024

18 మంది మృతి.. ప్రమాదం జరిగిందిలా

image

AP: అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో పేలుడుకు 18 మంది చనిపోయారు. ఈ ప్రమాదానికి కారణాలపై ఫ్యాక్టరీస్ విభాగం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ‘రియాక్టర్‌లో తయారైన మిథైల్ టెర్ట్-బ్యుటైల్ ఈథర్ మిశ్రమాన్ని ట్యాంకులోకి మార్చుతుండగా లీకై ఆవిరిగా మారింది. ఆ వాయువు వాతావరణంలోని రసాయనాలతో ప్రతిస్పందించడంతో పేలుడు జరిగింది. ఆ లీకేజీ మిశ్రమం ఎలక్ట్రిక్ ప్యానల్‌పై పడటంతో మంటలు చెలరేగాయి’ అని పేర్కొంది.

Similar News

News November 20, 2025

న్యూస్ అప్‌డేట్స్

image

✦ ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
✦ బీజేపీలో నాకు ఎవరితోనూ విభేదాలు లేవు: బండి సంజయ్
✦ దానం నాగేందర్, కడియంకి మరోసారి స్పీకర్ నోటీసులు.. అనర్హత పిటిషన్‌పై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం
✦ టీటీడీ కల్తీ నెయ్యి కేసు.. HYDలోని వైవీ సుబ్బారెడ్డి నివాసానికి సిట్ అధికారులు
✦ అన్ని పార్టీల్లో అంతర్గత విభేదాలు సహజం: ఈటల

News November 20, 2025

NIT దుర్గాపుర్‌లో 118 నాన్ టీచింగ్ పోస్టులు

image

NIT దుర్గాపుర్ 18 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 2వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, డిప్లొమా, BE, బీటెక్, MSc, MCA, PG, MBBS, MLSc, NET/SET ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు గ్రూప్ A పోస్టులకు రూ.1500, గ్రూప్ B, C పోస్టులకు రూ.1000.

News November 20, 2025

పెరిగిన చలి.. కోళ్ల సంరక్షణలో జాగ్రత్తలు(1/2)

image

ప్రస్తుతం రాత్రి వేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో కోళ్ల పెంపకందారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో కోళ్లఫామ్‌ల గదుల్లో తేమ ఎక్కువగా ఉండి శిలీంద్రాలు పెరిగే ఛాన్సుంది. దీని వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కోళ్లకు సోకి, అవి మరణించే ప్రమాదం ఉంటుంది. అందుకే కోళ్లకు వెచ్చదనం ఉండేలా షెడ్డు చుట్టూ పరదాలు అమర్చాలి. ఇదే సమయంలో గాలి ప్రసరణ షెడ్‌లోకి సరిగా ఉండేలా చూసుకోవాలి.