News March 17, 2024
180 సెలవులు ఎప్పుడైనా వాడుకోవచ్చు: ప్రభుత్వం

AP: మహిళా ఉద్యోగుల పిల్లల సంరక్షణ సెలవులపై విధించిన నిబంధనను ప్రభుత్వం తొలగించింది. వారు తమ పిల్లల వయసు 18 ఏళ్లు వచ్చేలోపే ఈ సెలవులు వినియోగించుకోవాలని గతంలో నిబంధన ఉంది. తాజాగా దీన్ని ఎత్తేసిన ప్రభుత్వం.. రిటైరయ్యేలోపు ఎప్పుడైనా 180 రోజుల సెలవులు వినియోగించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు అసెంబ్లీ ఉద్యోగులకు సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ సర్కార్ ఉత్తర్వులిచ్చింది.
Similar News
News November 24, 2025
శరణు ఘోషతోనే కొండ ఎక్కుతారు

శబరి యాత్రలో ఎత్తైన, నిట్టనిలువు కొండ ‘కరిమల’. సుమారు 10KM ఎత్తుకు వెళ్లిన తర్వాత భక్తులు దీని శిఖరాన్ని చేరుకుంటారు. ఇక్కడ అతి ప్రాచీనమైన బావి, జలపాతం ఉన్నాయి. భక్తులు ఇక్కడ దాహార్తిని తీర్చుకుంటారు. ఇంత ఎత్తులో జలపాతం ఉండటం దీని ప్రత్యేకత. ఈ కొండ ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. ‘స్వామియే శరణమయ్యప్ప’ అనే శరణు ఘోష ముందు ఈ కష్టం దూది పింజెలా తేలిపోతుంది. <<-se>>#AyyappaMala<<>>
News November 24, 2025
IIT ధన్బాద్ 105 పోస్టులకు నోటిఫికేషన్

<
News November 24, 2025
జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. జీవో నం.46 ప్రకారం 50% క్యాప్తో రిజర్వు స్థానాలు ఖరారు చేస్తూ కాసేపటి క్రితం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇందులో SC, STల పంచాయతీలు యథాతథంగా ఉండగా 22% రిజర్వేషన్ మాత్రమే అమలు చేస్తుండటంతో పలుచోట్ల BCల రిజర్వు స్థానాలు మారాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సైతం ఈ వివరాలు పంపింది.


