News April 18, 2024

1807 కేంద్రాలు.. 17,01573 మంది ఓటర్లు

image

పార్లమెంట్‌ ఎన్నికల సమరానికి శంఖారావం పూరించే సమయం ఆసన్నమైంది. నేటి నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 17,01573 ఓటర్లున్నారు. 936 ప్రదేశాల్లో 1807 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, 85 ఏళ్లు నిండిన వారు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకొనేందుకు 12- డీ ఫారాలు ఇప్పటికే ఇచ్చారు. వీటిని 22వ తేదీ నాటికి తిరిగి బీఎల్‌వోలకు అందించాలి.

Similar News

News April 20, 2025

రాజంపేట: ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతి

image

రాజంపేటలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గుడి తండాకి చెందిన మాలోత్ అనిత, గణేశ్‌ల చిన్న కుమారుడు చిన్నా శనివారం సాయంత్రం ఇంటి ముందు స్నేహితులతో కలసి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ట్రాక్టర్ గేర్లను మార్చగా న్యూట్రల్‌లోకి వెళ్లింది. వెనక పల్లంగా ఉండటంతో ట్రాక్టర్ టైర్ చిన్నాపై నుంచి వెళ్లింది. గాయపడిన చిన్నాను కామారెడ్డి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News April 20, 2025

పోతంగల్: కొడుకు పెళ్లి.. తండ్రి మృతి

image

తెల్లవారితే కొడుకు పెళ్లి ఉండగా రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందాడు. రుద్రూర్‌కు చెందిన నాగయ్య(52) తన కొడుకు పెళ్లి పత్రికలు ఇచ్చేందుకే శనివారం పోతంగల్‌లోని కారేగాంకు బైక్ పై వెళుతుండగా హంగర్గ ఫారం వద్ద అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి చెట్టును ఢీకొట్టాడు. అతడు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

News April 20, 2025

నిజామాబాద్: గల్ఫ్ బాధితులను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

image

నందిపేట్ మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన పొగరు రవి కిరణ్ ఫిర్యాదుపై నిజామాబాద్ జిల్లా సీపీ సాయి చైతన్య స్పందించారు. గల్ఫ్ బాధితులను మోసం చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి చీటింగ్, ఇమిగ్రేషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆరుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి పలు గ్రామాలకు చెందిన సుమారు 80 మందిని ముఠా సభ్యులు మోసం చేసినట్లుగా గుర్తించినట్లు సీపీ పేర్కొన్నారు.

error: Content is protected !!