News March 16, 2024

మెదక్ పార్లమెంట్ పరిధిలో 18,12,858 మంది ఓటర్లు

image

మెదక్ పార్లమెంట్ పరిధిలో 18 లక్షల 12 వేల 858 మంది ఉన్నారు. ఇందులో 8,95,777 పురుషులు, 9,16,876 మహిళలు, 205 ఇతరులున్నారు. సెగ్మెంట్‌లో సిద్దిపేటలో 2,36,474, మెదక్‌లో 2,16,748, నర్సాపూర్‌లో 2,26,154, సంగారెడ్డిలో 2,47,338, పటాన్‌చెరులో 4,07,419, దుబ్బాకలో 19,9,236, గజ్వే‌ల్‌లో 2,79,489 మంది ఓటర్లున్నారు. పార్లమెంట్ పరిధిలో మొత్తం 764 పోలింగ్ కేంద్రాలున్నాయి.

Similar News

News December 1, 2025

ఎలక్షన్ ఫీవర్.. మెదక్ ఎస్పీ హెచ్చరిక

image

మెదక్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరగాలంటే ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. గొడవలు, ప్రేరేపించే వ్యాఖ్యలు, ఓటర్లపై ఒత్తిడి, డబ్బు, మద్యం పంపిణీపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాలకు ఆయుధాలు, మొబైల్‌లు నిషేధం. పుకార్లు పుట్టిస్తే చర్యలు తప్పవని తెలిపారు. అనుమానాస్పద ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

News December 1, 2025

ఎలక్షన్ ఫీవర్.. మెదక్ ఎస్పీ హెచ్చరిక

image

మెదక్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరగాలంటే ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. గొడవలు, ప్రేరేపించే వ్యాఖ్యలు, ఓటర్లపై ఒత్తిడి, డబ్బు, మద్యం పంపిణీపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాలకు ఆయుధాలు, మొబైల్‌లు నిషేధం. పుకార్లు పుట్టిస్తే చర్యలు తప్పవని తెలిపారు. అనుమానాస్పద ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

News December 1, 2025

ఎయిడ్స్‌పై జాగ్రత్తే కవచం: మంత్రి దామోదర్

image

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి దామోదర్ రాజనరసింహ పిలుపునిచ్చారు. ఎయిడ్స్‌పై అపోహలు వీడి, అవగాహన పెంపొందించాలని, సమయానికి పరీక్షలు, సురక్షిత జీవనశైలి మాత్రమే రక్షణ మార్గమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గోప్యతతో ఉచిత చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. వివక్షకు చోటు లేకుండా ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని మంత్రి ఆకాంక్షించారు.