News February 24, 2026
182 గ్రామాల్లో 7.95 లక్షల పాసు పుస్తకాల పంపిణీ: కలెక్టర్

ఏలూరు జిల్లాలో రీ-సర్వే పూర్తయిన 182 గ్రామాల్లో ఇప్పటివరకు 79,500 పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. మార్చిలో మరో 10 గ్రామాల్లో పంపిణీకి సిద్ధంగా ఉన్నామన్నారు. ఏప్రిల్ నుంచి ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, మరిన్ని గ్రామాల్లో రైతులకు పాసు పుస్తకాలు అందజేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News February 26, 2026
మోదీ ఇజ్రాయెల్ పర్యటన తర్వాత ఇరాన్పై అమెరికా దాడి: ఒవైసీ

మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన వెంటనే ఇరాన్పై అమెరికా దాడి చేసే అవకాశం ఉందని అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు గాజా మారణహోమానికి నెతన్యాహునే కారణమని ఆరోపించారు. ఆయన్ని ‘యుద్ధ నేరస్థుడి’గా అభివర్ణించారు. అలాంటి వ్యక్తిని మోదీ కౌగిలించుకోవడమేంటి అని ప్రశ్నించారు. ఇది పాలస్తీనాకు భారత్ అందించే చిరకాల మద్దతును దెబ్బతీయడమేనని విమర్శించారు.
News February 26, 2026
ASF: విద్యుత్ ఫిర్యాదులు వాట్సాప్లోనే

ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారుల సౌకర్యం కోసం వాట్సాప్ చాట్ బాట్ ప్రారంభించిందని ఆసిఫాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఉత్తమ్ జాడే తెలిపారు. 7901628348కు వాట్స్ఆప్లో ‘Hi’ అని మెసేజ్ చేస్తే ఫిర్యాదు నమోదు అవుతుంది. ట్రాక్, ఏజెంట్తో చాట్ చేయవచ్చు. సర్వీస్ నంబర్తో ఫిర్యాదు ID వెంటనే వస్తుంది. పరిష్కారం తర్వాత SMS/IVRS ద్వారా సమాచారం అందుతుందన్నారు.
News February 26, 2026
కట్టకొక కంకి లేతైనా పుట్టికి ఏదుంతరుగు

పంట పండే సమయంలో ప్రతి మొక్కకు (కట్టకు) ఉండే కంకి గట్టిపడకుండా, పాలు పోసుకునే దశలో లేదా లేతగా ఉంటే, గింజ బరువు తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో పంటను అమ్మితే ఆశించిన బరువు రాకపోవడం వల్ల ఆదాయం తగ్గుతుంది. అంటే పంట కేవలం సంఖ్యలో (కంకులు) ఎక్కువగా ఉంటే సరిపోదు, గింజ ముదిరి గట్టిగా ఉంటేనే రైతుకు సరైన బరువు, తద్వారా లాభం వస్తుందని ఈ సామెత తెలియజేస్తుంది.


