News June 4, 2024
1,84,442 ఓట్ల ఆధిక్యంలో బలరాం నాయక్
మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ 1,84,442 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవితకు 1,43,318 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు 3,27,760 వచ్చాయి. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కాసేపట్లో మహబూబాబాద్ చివరి ఫలితం విడుదల కానుంది.
Similar News
News October 4, 2024
వరంగల్ మార్కెట్లో స్థిరంగా పత్తి ధరలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి నేడు శుక్రవారం పత్తి భారీగా తరలివచ్చింది. అయితే ధరలు మాత్రం నిన్నటి లాగే తటస్థంగా ఉన్నాయి. గురువారం క్వింటా పాత పత్తి ధర రూ.7,450 ధర పలకగా.. నేడు కూడా అదే ధర పలికింది. అలాగే కొత్తపత్తికి నిన్న రూ.6,925 ధర రాగా నేడు రూ.6,925 అదే ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు.
News October 4, 2024
మలుగు: రోడ్డుపై భారీ కొండచిలువ
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం నుంచి కుమ్మరిగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై భారీ కొండచిలువ గురువారం రాత్రి ప్రత్యక్షమైంది. దీంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సుమారు 10 అడుగుల పొడవు ఉందని స్థానికులు తెలిపారు. కాగా ప్రయాణికుల చప్పుడుతో పొదల్లోకి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
News October 3, 2024
వరంగల్: నేడు ఎస్జీటీ అభ్యర్థులకు సర్టిఫికెట్ పరిశీలన
వరంగల్ జిల్లా ఎస్జీటీ 1:3 నిష్పత్తిలో భాగంగా గురువారం 271 నుంచి 435 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్ పరిశీలన ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ తెలిపారు. నిన్న సర్టిఫికెట్ పరిశీలనకు రాని అభ్యర్థులు.. ఈరోజు కూడా అటెండ్ అవ్వవచ్చన్నారు. అభ్యర్థులు వచ్చే ముందు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు సంబంధిత గెజిటెడ్ సంతకంతో సర్టిఫికెట్లన్నీ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని అన్నారు.