News April 4, 2024
అకౌంట్లో రూ.18,750 పడ్డాయా?

AP: వైఎస్సార్ చేయూత కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.18,750 అందిస్తోంది. నెల రోజుల క్రితం అంటే మార్చి 7న సీఎం జగన్ బటన్ నొక్కి 4వ విడత నిధులను విడుదల చేశారు. కొందరికి డబ్బులు రాగా, ఇంకా తమ ఖాతాల్లో డబ్బులు పడలేదని చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వల్లే జాప్యం జరుగుతోందని కొందరు, నోటిఫికేషన్కు ముందే బటన్ నొక్కారని మరికొందరు గుర్తుచేస్తున్నారు.
Similar News
News April 7, 2026
రహానే స్పందించాల్సిన అవసరం లేదు: సెహ్వాగ్

స్ట్రైక్ రేట్పై విమర్శలకు <<19553716>>రహానే<<>> స్పందించిన తీరు సరికాదని టీమ్ఇండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ అన్నారు. ఆటతీరుపై పొగడ్తలు, విమర్శలు సాధారణమేనని వాటిపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. సచిన్ తనకు స్ఫూర్తి అని.. ఓ పత్రిక ‘Endulkar’ అని వ్యంగ్యంగా విమర్శించినా ఆటతోనే బదులు చెప్పారన్నారు. అమితాబ్ బచ్చన్ కూడా విమర్శకులకు అలాగే బదులిస్తారన్నారు. కాబట్టి రహానే కూడా అదే ఫాలో అయితే మంచిదని సూచించారు.
News April 7, 2026
ఆరో తరగతి చదివిన TN అభ్యర్థికి రూ.వెయ్యికోట్ల ఆస్తి!

తమిళనాడు ఎన్నికల బరిలో లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ భార్య, AIADMK అభ్యర్థి లీమా రోజ్ మార్టిన్ అత్యంత ధనిక అభ్యర్థిగా నిలిచారు. తన అఫిడవిట్లో రూ.1,041 కోట్ల నికర ఆస్తులు, రూ.8.57కోట్ల అప్పులున్నట్లు ఆమె ప్రకటించారు. ఇందులో రూ.910 కోట్ల విలువైన భూములు, భవనాలు ఉన్నాయి. ఆరో తరగతి వరకు మాత్రమే చదివిన లీమాకు బంగారం, వజ్రాలు, షేర్లలోనూ భారీగా పెట్టుబడులున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
News April 7, 2026
పాక్.. ముందు మీ పరిస్థితి చక్కదిద్దికో!

హార్ముజ్ నుంచి నౌకలు రాక దేశంలో ఇంధన కొరత ఏర్పడి పాక్షిక <<19590326>>లాక్డౌన్<<>> విధించిన పాకిస్థాన్.. భారత్లోని <<19571096>>కోల్కతా<<>> వరకు వస్తామంటూ బీరాలు పలకడం హాస్యాస్పదం. ‘ముందు మీ నౌకలు రప్పించుకోండి. భారీగా పెరిగిన పెట్రోల్ రేట్లను తగ్గించుకోండి. తర్వాత మా దేశానికి రావొచ్చు. అయినా మీకు మరోసారి అలాంటి ఆలోచన రాకుండా IND బుద్ధి చెబుతుంది’ అని కొందరు నెటిజన్లు SMలో కామెంట్స్ చేస్తున్నారు. పాక్ తీరుపై మీరేమంటారు?


