News April 7, 2025
18,799 ఉద్యోగాలు.. UPDATE

RRB అసిస్టెంట్ లోకో పైలట్ కొత్త పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్-2 మే 2, 6 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉ.7.30, మ.12.30 గంటలకు రెండు షిఫ్టుల్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 19, 20 తేదీల్లోనే ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో వాయిదా పడ్డాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 18,799 పోస్టులు భర్తీ చేయనున్నారు.
Similar News
News February 8, 2026
సెట్లో తాగుబోతును చితకబాదా: సాయి ధన్సిక

తాను నటించిన ‘యోగిడా’ మూవీ సెట్లో ఓ వ్యక్తిని చితకబాదినట్లు హీరోయిన్ సాయి ధన్సిక తెలిపారు. ‘కేరళలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి ఫొటో దిగేందుకు వచ్చాడు. అతడు తాగి ఉండటంతో ఫొటో ఇచ్చేందుకు నా అంకుల్ ఒప్పుకోలేదు. దీంతో అంకుల్ని కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అది చూసి కోపంలో పరిగెత్తుకుంటూ వెళ్లి అతడిని చితకబాదా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హీరో విశాల్తో ఈ బ్యూటీ ఎంగేజ్మెంట్ జరిగింది.
News February 8, 2026
ఫిబ్రవరి 8: చరిత్రలో ఈరోజు

✒ 1897: మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ జననం(ఫొటోలో) ✒ 1902: సుప్రసిద్ధ కవి ఆండ్ర శేషగిరిరావు జననం ✒ 1934: ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వర రావు జననం ✒ 1941: గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ జననం ✒ 1957: నటి వై.విజయ జననం ✒ 1963: IND మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జననం
News February 8, 2026
చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా

యూఎస్ఏపై విజయంతో టీమ్ ఇండియా T20IWCలో వరుసగా అత్యధిక మ్యాచులు గెలిచిన జట్టుగా నిలిచింది. 2024 నుంచి ఇప్పటివరకు వరుసగా 9 మ్యాచులు గెలిచింది. దీంతో సౌతాఫ్రికా(2024లో 8విజయాలు)ను దాటేసింది. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా(8wins) ఉంది. అటు WCలో వన్డే, టీ20ల్లో కలిపి ఓవరాల్గా టీమ్ ఇండియా 100 విజయాలు పూర్తి చేసుకుంది. ఆస్ట్రేలియా(108) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో టీమ్ కావడం గమనార్హం.


