News June 24, 2024
18వ లోక్సభ విశేషాలివే..
నేడు ప్రారంభమయ్యే 18వ లోక్సభ సమావేశాల్లో సగానికిపైగా కొత్త ఎంపీలు పాల్గొనబోతున్నారు. మొత్తం సభ్యుల్లో దాదాపు 52% అంటే 280 మంది కొత్తవారు ఎంపీలుగా సభలో అడుగుపెట్టనున్నారు. మిగిలిన వారిలో 216 మంది ఎంపీలు గత సభలో ఉన్నవారు కాగా మరికొందరు అంతకుముందు సభ్యులుగా ఎన్నికైనవారు. మొత్తం 41 పార్టీల నుంచి ఎంపీలున్నారు. సంఖ్యాపరంగా బీజేపీ(240), కాంగ్రెస్(99), సమాజ్ వాదీ పార్టీ(37) టాప్-3లో ఉన్నాయి.
Similar News
News October 9, 2024
టాప్-10లోకి దూసుకొచ్చిన అర్ష్దీప్
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో టీమ్ ఇండియా స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ తొలిసారి టాప్-10లోకి దూసుకొచ్చారు. భారత్ తరఫున అర్ష్దీప్ ఒక్కరే టాప్-10లో ఉన్నారు. ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో హార్దిక్ పాండ్య 3, అక్షర్ పటేల్ 11వ స్థానం దక్కించుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో సూర్యకుమార్ యాదవ్ 2, యశస్వీ జైస్వాల్ 4, రుతురాజ్ గైక్వాడ్ 9వ స్థానంలో ఉన్నారు.
News October 9, 2024
ఈ జిల్లాలకు వర్ష సూచన: APSDMA
AP: రేపు అల్లూరి, ఎన్టీఆర్, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది.
News October 9, 2024
జెత్వానీకి ఎస్కార్టు ఎందుకు?: వెల్లంపల్లి
AP: దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మిని రోడ్డుపై నిలిపేసి, నటి కాదంబరి జెత్వానీని ఎస్కార్టుతో పంపడం దారుణమని వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు జరుగుతున్న తీరు చూస్తుంటే బాధేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘పవన్ రాకతో సాధారణ భక్తులను దర్శనానికి అనుమతించలేదు. ఉచిత బస్సుల్లో వృద్ధులను ఎక్కించుకోవటం లేదు’ అని ఆయన ఫైర్ అయ్యారు.