News February 13, 2025

19న BRS విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని KCR ఆదేశం

image

19వ తేదీన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ అధినేత కేసిఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్౨ను ఆదేశించారు. సమావేశానికి కావలసిన ఏర్పాట్లను హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేయాలని కెసిఆర్ సూచించారు.19న నిర్వహించే ప్రత్యేక సమావేశంలో పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ, పార్టీ సభ్యత్వ నమోదుపై చర్చించనున్నారు.

Similar News

News December 9, 2025

MNCL: ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

image

ఈ నెల 11న జరగనున్న మొదటి విడత సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని అన్నారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలింగ్ రోజు తీసుకోవలసిన చర్యలు, ఓట్ల లెక్కింపు, ఉపసర్పంచ్ ఎన్నిక, ప్రవర్తన నియమావళి అమలు, ఓటర్ల ప్రభావిత అంశాలను అరికట్టడంపై సూచనలు చేశారు.

News December 9, 2025

తిరుపతి జిల్లాలో విషాదం.. ఇద్దరు మృతి

image

తిరుపతి(D) నారాయణవనం మండలంలో విషాద ఘటన జరిగింది. నగరి(ఛ) గుండ్రాజుకుప్పానికి చెందిన గుణశేఖర్(42) తిరువట్యంలో జరిగిన బంధువుల దహనక్రియలకు హాజరయ్యారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా తిరువట్యం కాజ్‌వే వద్ద నారాయణవనం రజక కాలనీకి చెందిన అంకమ్మ(72) బట్టలు ఉతుకుతూ నదిలో పడిపోవడాన్ని ఆయన గుర్తించారు. ఆమెను కాపాడడానికి గుణశేఖర్ నదిలోకి దూకారు. ఈత రాకపోవడంతో వృద్ధురాలితో పాటు అతనూ నీట మునిగి చనిపోయారు.

News December 9, 2025

ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్

image

మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. మొదటి దశ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అబ్జర్వర్లతో ఆమె మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. సిరిసిల్ల కలెక్టరేట్ నుంచి ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.