News April 17, 2024
19న నామినేషన్ పెద్దిరెడ్డి నామినేషన్

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ పుంగనూరు MLA అభ్యర్థిగా ఈనెల 19న శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు తరలి రావాలని చౌడేపల్లి వైస్ ఎంపీపీ సుధాకర్ రెడ్డి కోరారు. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి చౌడేపల్లెకు చేరుకోవాలని సూచించారు. అనంతరం భారీ ర్యాలీగా పుంగనూరుకు వెళ్తామన్నారు.
Similar News
News April 23, 2025
టెన్త్ ఫలితాలు: 6 నుంచి 24వ స్థానానికి చిత్తూరు జిల్లా

ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో చిత్తూరు జిల్లాలో ఉత్తీర్ణత శాతం తీవ్ర నిరాశకు గురి చేసింది. గతేడాది టెన్త్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 91.28% ఉత్తీర్ణతతో 6వ స్థానంలో నిలవగా, ఈ ఏడాది 67.06 శాతంతో 24వ స్థానంలో నిలిచింది. ఏడాది వ్యవధిలో దాదాపు 18 స్థానాలు దిగజారడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.
News April 23, 2025
టెన్త్ ఫలితాల్లో 24వ స్థానంలో చిత్తూరు జిల్లా

తాజా టెన్త్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 24వ స్థానంలో నిలించింది. మొత్తం 20,796 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 13,946 మంది పాస్ అయ్యారు. 10,723 మంది అబ్బాయిలకుగాను 6,573 మంది, అమ్మాయిలు 10,073 మందికిగాను 7,373 మంది పాస్ అయ్యారు. కాగా 67.06 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
News April 23, 2025
సివిల్స్లో మెరిసిన పలమనేరు వాసి

UPSC తుది ఫలితాలలో చిత్తూరు జిల్లా వాసి సత్తా చాటాడు. పలమనేరుకు చెందిన రంపం శ్రీకాంత్ మంగళవారం వెలువడిన సివిల్స్ ఫలితాల్లో 904వ ర్యాంకు సాధించాడు. శ్రీకాంత్ ఎలాంటి కోచింగ్ లేకుండా ఈ ఘనత సాధించడంతో జిల్లా వాసులు అతనికి అభినందనలు తెలిపారు.