News October 16, 2025
19న వేములవాడకు శృంగేరి పీఠాధిపతి..!

రాజన్న ఆలయాభివృద్ధే ప్రధాన ఎజెండా అని వేములవాడ MLA, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ ఆలయ విస్తరణ పనులపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, కలెక్టర్ ఎం.హరిత, ఎస్పీ మహేష్ బీ గితేతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. భక్తుల సూచనల మేరకు రూ.76 కోట్లు ఆలయ విస్తరణకు, రూ.35 కోట్లు అన్నప్రసాద శాలకు కేటాయించామని చెప్పారు. 19న శృంగేరి పీఠాధిపతి గుడికి రానున్నారని పేర్కొన్నారు.
Similar News
News October 16, 2025
తెలంగాణ అప్డేట్స్

*నేడు క్యాబినెట్ భేటీ.. BC రిజర్వేషన్ బిల్లు, సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపు వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం
*స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. GO-9పై హైకోర్టు స్టే విధించడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసిన రేవంత్ సర్కార్
*నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మార్క్ఫెడ్ ద్వారా 200 సెంటర్లలో మొక్కజొన్న పంట కొనుగోళ్లు
News October 16, 2025
చైనాపై 500% టారిఫ్స్ విధించాలి: బెస్సెంట్

US-చైనా ట్రేడ్ వార్ మరింత ముదిరేలా కనిపిస్తోంది. చైనాపై టారిఫ్స్ను 500%కి పెంచుతామని అమెరికా బెదిరిస్తోంది. ‘రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు 85మంది US సెనేటర్లు చైనాపై టారిఫ్స్ను 500%కి పెంచేందుకు ట్రంప్కు అధికారమివ్వాలని చూస్తున్నారు’ అని US ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. పైకి రష్యన్ ఆయిల్ పేరు చెబుతున్నా.. రేర్ ఎర్త్ మెటల్స్ కోసమే ఈ బెదిరింపులని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News October 16, 2025
యజ్ఞం ఎలా ఆవిర్భవించిందంటే?

మనిషి చేసే ఏ కార్యమైనా ఫలించాలంటే మానవ ప్రయత్నం మాత్రమే సరిపోదు. అందుకు దైవకృప కూడా తప్పనిసరిగా ఉండాలి. మన వేదం కూడా ఇదే విషయం చెబుతోంది. అందుకే దైవకృపను పొందడానికి వేదం యజ్ఞాన్ని ఆవిర్భవించింది. యజ్ఞం అంటే ఒంటరిగా చేసేది కాదు. అందరూ కలిసి చేయాలి. అప్పుడే అద్భుతమైన ఫలితం ఉంటుంది. పురోహితులు, యజమానులు.. ఇలా సమష్టి శ్రమ, కృషి వల్లే యజ్ఞం విజయవంతం అవుతుంది. <<-se>>#VedikVibes<<>>