News July 17, 2024
19 నుంచి మిర్యాలగూడ స్టాప్ ఎత్తివేత

విశాఖ, చైన్నె, నారాయణాద్రి రైళ్లకు మిర్యాలగూడలో ఈనెల 19నుంచి స్టాప్ను ఎత్తివేస్తూ రైల్వే అధికారులు ఆదేశాలిచ్చారు. కోవిడ్ సమయంలో ఈ రైళ్లకు స్టాప్ ఎత్తివేయగా EX MP ఉత్తమ్, EX MLA భాస్కర్రావు మిర్యాలగూడలో రైళ్లను నిలపాలంటూ అధికారులకు విన్నవించారు. గత ఏడాది జులై నుంచి ఆయా రైళ్లు నిలిచేలా అనుమతించారు. ఆదేశాలిచ్చేటప్పుడే ఏడాది పాటు రైళ్లు నిలుపుతామని ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం ఏడాది పూర్తయింది.
Similar News
News February 15, 2026
NLG: అంగన్వాడీలపై ఇక పటిష్ఠ నిఘా

అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వీటి పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తోంది. ఆయా కేంద్రాల్లో కొనసాగుతున్న కార్యక్రమాలతో పాటు ప్రీస్కూల్, పోషకాహార పంపిణీ తదితర కార్యక్రమాలను ఈ కమిటీలు నిత్యం పర్యవేక్షించనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,093 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. రెండున్నరేళ్లుగా గ్రామాల్లో సర్పంచులు లేక గతంలో ఉన్న కమిటీలు అంతగా పనిచేయ లేదు.
News February 14, 2026
విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఛాయా సోమేశ్వరాలయం

చారిత్రక ప్రసిద్ధి గాంచిన నల్లగొండ పట్టణంలోని ఛాయా సోమేశ్వరస్వామి ఆలయం మహాశివరాత్రి పర్వదినానికి సర్వంగ సుందరంగా సిద్ధమైంది. రేపు జరగనున్న వేడుకల కోసం ఆలయ కమిటీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.విద్యుత్ దీపాలంకరణతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలుగుతోంది. తెల్లవారుజాము నుంచే అభిషేకాలు, ప్రత్యేక పూజలు ప్రారంభం కానున్నాయి.
News February 14, 2026
నల్గొండ: గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి

చిట్యాల మండలం నేరడ పంచాయతీ కార్యదర్శి మేకల వెంకటేశ్వరరావు (61) ఇవాళ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు. హైదరాబాద్ ఇమ్లిబన్ బస్టాండ్లో ఈ ఘటన జరగ్గా పోలీసులు అధికారులకు సమాచారం ఇచ్చారు. గతంలో ఇదే మండలంలోని ఏపూరులో విధులు నిర్వహించారు. ఈ సెప్టెంబర్లో రిటైర్డ్ కావలసి ఉంది. ఆయన మృతి పట్ల మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పీఎస్లు సానుభూతిని తెలిపారు.


