News May 5, 2024
వడదెబ్బకు ఒక్కరోజే 19 మంది మృతి

TG: రాష్ట్రంలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. శనివారం పలు జిల్లాల్లో వడదెబ్బతో ఏకంగా 19 మంది చనిపోయారు. ఇందులో వెల్గటూరుకు చెందిన MEO భూమయ్య(57) కూడా ఉన్నారు. జగిత్యాల, కరీంనగర్, నల్గొండ, NZB, నారాయణపేట, మంచిర్యాల జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 22 జిల్లాల్లో వడగాలులు వీయగా.. హైదరాబాద్లో గాలిలో తేమ 15శాతానికి పడిపోయింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News October 28, 2025
పునరావాస కేంద్రాల్లో ఆహారం, దుప్పట్లు పంపిణీ

AP: ‘మొంథా’ తుఫాను ప్రభావిత జిల్లాల్లో నిరాశ్రయులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. స్థానికంగా వారికి ఆశ్రయం కల్పించి ఆహారం, దుప్పట్లు పంపిణీ చేశారు. మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సన్నద్ధమయ్యాయి. అటు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు తగిన సూచనలు చేస్తున్నారు.
News October 28, 2025
TETపై సుప్రీంలో రివ్యూ పిటిషన్: లోకేశ్

AP: టీచర్ల వినతి మేరకు TET తీర్పుపై సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. 2010కి ముందు ఎంపికైన టీచర్లూ టెట్ పాసవ్వాలని సుప్రీం తీర్పు ఇవ్వడంతో వారు ఆవేదనలో ఉన్నారని MLCలు ఆయన దృష్టికి తీసుకురాగా ఈ విధంగా స్పందించారు. టెట్ పాస్ కాకుంటే పోస్టుకు అనర్హులనడంతో ఆందోళనకు గురవుతున్నారని నేతలు చెప్పారు. కాగా తాజా TET మాత్రం కోర్టు తీర్పు ప్రకారమే ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
News October 28, 2025
మూవీ అప్డేట్స్

* అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘డెకాయిట్’ మూవీ వచ్చే ఏడాది మార్చి 19న విడుదల
* నవీన్ పొలిశెట్టి, రవితేజ కాంబినేషన్లో సినిమా.. ప్రసన్న కుమార్ కథకు Ok చెప్పిన హీరోలు!
* తిరువీర్ హీరోగా తెరకెక్కిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ రిలీజ్.. NOV 7న మూవీ రిలీజ్
* ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు అభిషన్ జీవంత్కు పెళ్లి కానుకగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత మాగేశ్ రాజ్


