News May 5, 2024
వడదెబ్బకు ఒక్కరోజే 19 మంది మృతి

TG: రాష్ట్రంలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. శనివారం పలు జిల్లాల్లో వడదెబ్బతో ఏకంగా 19 మంది చనిపోయారు. ఇందులో వెల్గటూరుకు చెందిన MEO భూమయ్య(57) కూడా ఉన్నారు. జగిత్యాల, కరీంనగర్, నల్గొండ, NZB, నారాయణపేట, మంచిర్యాల జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 22 జిల్లాల్లో వడగాలులు వీయగా.. హైదరాబాద్లో గాలిలో తేమ 15శాతానికి పడిపోయింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News November 27, 2025
తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్పై సీఎం రేవంత్ సమీక్ష

TG: తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్పై సమీక్షించిన సీఎం రేవంత్ అధికారులకు పలు సూచనలు చేశారు. ‘ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలి. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా విభజించుకోవాలి. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ ఉండదని చాటి చెప్పేలా తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలి’ అని తెలిపారు.
News November 27, 2025
ట్రేడ్ మోసం.. ₹35 కోట్లు నష్టపోయిన పెద్దాయన

ట్రేడ్ ఫ్రాడ్ వల్ల ₹35 కోట్లు నష్టపోయారో వ్యాపారవేత్త. ముంబైకి చెందిన భారత్ హారక్చంద్ షా(72) వారసత్వంగా వచ్చిన షేర్లను 2020లో గ్లోబ్ క్యాపిటల్ మార్కెట్స్ కంపెనీ డిమ్యాట్ అకౌంట్కు బదిలీ చేశారు. కంపెనీ ఉద్యోగులు ఆయన ఖాతాను చూసుకుంటామని చెప్పి 2020-24 మధ్య ఫ్రాడ్ చేశారు. ఈ క్రమంలో ₹35 కోట్ల అప్పు ఉందని కంపెనీ చెప్పడంతో ఆయన షాకయ్యారు. మొత్తం అప్పును చెల్లించిన షా.. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News November 27, 2025
ఇల్లు మూలల ఆధారంగా ఉంటే ఏ దిక్కున పడుకోవాలి?

ఇల్లు మూలలకు ఉన్నప్పుడు నైరుతి మూలకు తల, ఈశాన్య మూలకు కాళ్లు పెట్టుకుని పడుకోవడం మంచిదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇది చక్కటి నిద్రకు, ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు. ‘నైరుతి స్థిరమైన శక్తినిస్తుంది. ఈశాన్యం నుంచి పాదాల ద్వారా శుభకరమైన కాస్మిక్ శక్తిని స్వీకరించడానికి సహాయపడుతుంది. అలాగే పనుల పట్ల ఏకాగ్రతను పెంచుతుంది’ అని వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>


