News February 26, 2025

195 మంది పోస్టల్ బ్యాలెట్‌ వినియోగం

image

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ కోసం 255 మంది దరఖాస్తు చేసుకోగా 195 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా కలెక్టరేట్‌లో ఓటరు సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జరిపామన్నారు.

Similar News

News February 26, 2025

నిజామాబాదు : రంజాన్ మాస సౌకర్యాల ఏర్పాటు:కలెక్టర్

image

రంజాన్ మాసం ప్రారంభం నేపథ్యంలో సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. కలెక్టర్ తన ఛాంబర్‌లో మంగళవారం జిల్లా అధికారులతో సమావేశమై, రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, సౌకర్యాలపై సమీక్ష జరిపారు. ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లకు తావులేకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలలో సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు.

News February 25, 2025

NZB: 96.78 శాతం పరీక్షలు రాసిన విద్యార్థులు

image

నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో 96.78 శాతం హాజరు నమోదైందని గురుకులాల ప్రవేశ పరీక్షల రీజనల్ కో ఆర్డినేటర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 20 సెంటర్లు ఏర్పాటు చేశారన్నారు. పరీక్షల కోసం 7,906 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 7,651 మంది పరీక్షలు రాసినట్లు వెల్లడించారు. కాగా 255 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

News February 25, 2025

నిజామాబాద్: భార్య తిట్టిందని భర్త ఫిర్యాదు

image

వేరే వ్యక్తి ఇంట్లోకి ఎందుకు వచ్చాడని అడిగినందుకు భార్య తిట్టిందని భర్త ఆదిభట్ల PSలో ఫిర్యాదు చేశాడు. పోలీసుల ప్రకారం.. ఇంద్రసేనారెడ్డి భార్యతో రాగన్నగూడలో ఉంటున్నాడు. భార్య NZB జిల్లా భోదన్‌లోని ఓ గ్రామంలో జీపీ కార్యదర్శిగా పనిచేస్తుంది. 15 రోజులకు ఒకసారి వస్తుంటుంది. ఈ క్రమంలో 23న భార్యకు ఫోన్ చేస్తే ఎత్తలేదు. కాసేపటికి ఇంట్లో నుంచి ఓ వ్యక్తి పరార్ అవ్వడంతో ప్రశ్నించగా, ఆమె తిట్టిందని తెలిపారు.

error: Content is protected !!