News February 6, 2025

197 మంది బాలకార్మికులను గుర్తించాం: SRPT ఎస్పీ

image

 జిల్లాలో జనవరి నెలలో నెలరోజుల పాటు జిల్లా పోలీసు యంత్రాంగం, వివిధ అధికారుల సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ పగడ్బందీగా నిర్వహించామని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. నిరాధరణకు, వెట్టిచాకిరీ గురవుతున్న 197 మంది బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులకు, సంరక్షులకు అప్పగించడం జరిగిందన్నారు. బాలలను పనిలో పెట్టుకోవద్దని హెచ్చరించారు. 

Similar News

News November 18, 2025

నీటి వాడుక లెక్కలు తేల్చేందుకు AP సహకరించడం లేదు: ఉత్తమ్

image

కృష్ణా జలాల వినియోగాన్ని తెలుసుకొనేలా టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు AP సహకరించడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ‘నీటిని ఏ రాష్ట్రం ఎంత వినియోగిస్తోందో తెలుసుకొనేందుకు 18 టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటుచేశాం. మరో 20 ఏర్పాటుకావాలి. వీటి ఏర్పాటుకు ఏపీ ముందుకు రావడం లేదు. తన వాటా నిధులూ ఇవ్వడం లేదు. స్టేషన్ల ఏర్పాటుకు ఆ నిధులనూ మేమే ఇస్తామని కేంద్రానికి చెప్పా’ అని ఉత్తమ్ పేర్కొన్నారు.

News November 18, 2025

RGM: సమ్మక్క జాతర ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్న సమ్మక్క జాతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం పరిశీలించారు. గోదావరిఖని పట్టణ శివారులోని గోదావరి బ్రిడ్జి వద్ద, అంతర్గాం మండలం గోలివాడ జాతర నిర్వహణ ఏర్పాట్లను ఆయన అధికారులతో కలిసి సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతర విజయవంతానికి అన్ని విభాగాల అధికారులు సమాయత్తంగా ఉండాలన్నారు.

News November 18, 2025

సాధారణ ప్రసవాలు పెంచాలి: కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే సేవల నాణ్యత మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ప్రాంతాల్లో సాధారణ ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణీల ఫాలోఅప్‌ను ఆశా కార్యకర్తలతో సమన్వయం చేయాలని, ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫరల్ అవకాశం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.